గెలిపిస్తే గ్రామ సమస్యలకు శాశ్వత పరిష్కారం
స్థానిక ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
సర్పంచ్గా గెలిపిస్తే గ్రామంలో కోతులు, వీధికుక్కల బెడదను శాశ్వతంగా అరికట్టేందుకు చర్యలు తీసుకుంటానని బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి అంబటి ఉపేంద్రమ్మ రవీందర్ రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం రామన్నపేట మండలంలోని పలు కాలనీల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు.
గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న రోజువారీ సమస్యల పరిష్కారమే తన ప్రథమ లక్ష్యమని పేర్కొన్న ఆయన, వృద్ధులు, వికలాంగులకు ఇంటివద్దకే మంచినీరు చేరేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తానన్నారు. పంచాయతీ నిధులను పూర్తిగా పారదర్శకంగా ఖర్చు చేసి గ్రామ అభివృద్ధిని వేగవంతం చేస్తానని తెలిపారు.
రేపు జరగబోయే ఎన్నికల్లో ‘బ్యాటు’ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి