PRINT TIME: March 25, 2026 02:12 PM
గడువులోపు పనులు పూర్తి చేయాలి:జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య
గడువులోపు పనులు పూర్తి చేయాలి:జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య
March 23, 2026 07:49 PM
36 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, సంగారెడ్డి మరియు నారాయణఖేడ్ స్టేడియంలలో జరుగుతున్న మౌలిక వసతుల పనులను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో,పనుల్లో జాప్యం లేకుండా నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియం,నారాయణఖేడ్ స్టేడియం మరమ్మత్తులు త్వరగా పూర్తి చేయాలని,స్విమ్మింగ్ పూల్ ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని తెలిపారు.అంగన్వాడీ కేంద్రాల విద్యుతీకరణ,చిన్నపాటి మరమ్మత్తులు, గ్రామాల్లో సీసీ రోడ్లు, పాఠశాలల కాంపౌండ్ గోడలు వంటి పనులను మార్చి 31లోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి