గాంధీజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు పాటుపడాలి
గాంధీజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు పాటుపడాలి
Biksham
హింస మార్గాన్ని ఆయుధంగా చేసుకొని భారతదేశానికి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టిన మహాత్ముడు మహాత్మా గాంధీ అని శ్రీ వాసవి సేవా సమితి జిల్లా అధ్యక్షుడు బచ్చు పురుషోత్తం అన్నారు.జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి శ్రీ వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక చెంప కొడితే మరో చెంప చూపించమని అహింసా మార్గాన్ని ఎంచుకొని శాంతియుతంగా స్వాతంత్రాన్ని సాధించిన ఘనత మహాత్మా గాంధీకే దక్కుతుందన్నారు.మహాత్మా గాంధీ చూపిన మార్గాన్ని అనుసరిస్తూ ఆయన ఆశయాలను సాధించడంలో నేటి యువత ముందుండాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి సేవా సమితి ప్రధాన కార్యదర్శి దేవరశెట్టి నాగరాజు, కోశాధికారి సోమా ప్రవీణ్ కుమార్, ఉపాధ్యక్షులు మిర్యాల సుధాకర్, కుంచపర్తి రాజశేఖర్, సహాయ కార్యదర్శులు తప్సీ అనిల్ కుమార్, బచ్చు శ్రీనివాస్, సభ్యులు శ్రీరంగం రాము, వందనపు వెంకటేశ్వర్లు, దేవరశెట్టి సోమయ్య, మంచాల శ్రీనివాసు, తల్లాడ శ్రీనివాస్, గుండా శ్రీధర్, వెంపటి శబరినాథ్, మిట్టపల్లి రమేష్, నూనే యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి