Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:03 AM

గాంధీజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు పాటుపడాలి

గాంధీజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు పాటుపడాలి

గాంధీజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు పాటుపడాలి
January 30, 2026 06:03 PM 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

హింస మార్గాన్ని ఆయుధంగా చేసుకొని భారతదేశానికి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టిన మహాత్ముడు మహాత్మా గాంధీ అని శ్రీ వాసవి సేవా సమితి జిల్లా అధ్యక్షుడు బచ్చు పురుషోత్తం అన్నారు.జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి శ్రీ వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక చెంప కొడితే మరో చెంప చూపించమని అహింసా మార్గాన్ని ఎంచుకొని శాంతియుతంగా స్వాతంత్రాన్ని సాధించిన ఘనత మహాత్మా గాంధీకే దక్కుతుందన్నారు.మహాత్మా గాంధీ చూపిన మార్గాన్ని అనుసరిస్తూ ఆయన ఆశయాలను సాధించడంలో నేటి యువత ముందుండాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి సేవా సమితి ప్రధాన కార్యదర్శి దేవరశెట్టి నాగరాజు, కోశాధికారి సోమా ప్రవీణ్ కుమార్, ఉపాధ్యక్షులు మిర్యాల సుధాకర్, కుంచపర్తి రాజశేఖర్, సహాయ కార్యదర్శులు తప్సీ అనిల్ కుమార్, బచ్చు శ్రీనివాస్, సభ్యులు శ్రీరంగం రాము, వందనపు వెంకటేశ్వర్లు, దేవరశెట్టి సోమయ్య, మంచాల శ్రీనివాసు, తల్లాడ శ్రీనివాస్, గుండా శ్రీధర్, వెంపటి శబరినాథ్, మిట్టపల్లి రమేష్, నూనే యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News