Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అన్నదాతల ఆక్రందనలు పట్టని పాలకులు – అశోక్ రెడ్డి కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 06:24 PM

గద్దర్ ఒక వ్యక్తి కాదు… ఒక ఉద్యమం: సిపిఐ నాయకులు

గద్దర్ ఒక వ్యక్తి కాదు… ఒక ఉద్యమం: సిపిఐ నాయకులు

గద్దర్ ఒక వ్యక్తి కాదు… ఒక ఉద్యమం: సిపిఐ నాయకులు
January 31, 2026 02:16 PM 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా స్థానికం ప్రతినిధి

నారాయణఖేడ్ అంబేద్కర్ భవన్‌లో ప్రజా యుద్ధనౌక, తెలంగాణ పోరాటయోధుడు గద్దర్ (గుమ్మడి విఠల్ రావు) జయంతిని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఆనంద్‌తో పాటు జిల్లా నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సిపిఐ జిల్లా నాయకుడు చిరంజీవి మాట్లాడుతూ, గద్దర్ ఒక వ్యక్తి కాదని, ఒక ఉద్యమమని, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన పోరాట గళమని కొనియాడారు. అణచివేత,అన్యాయం,అసమానతలకు వ్యతిరేకంగా తన ఆటపాటలు, కళారూపాల ద్వారా ప్రజలను చైతన్యపరిచిన మహనీయుడు గద్దర్ అని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల పోరాట చరిత్రలో గద్దర్ పాత్ర ఎనలేనిదని పేర్కొన్నారు.సమాజంలో కుల, మత, వర్గ వివక్షలకు వ్యతిరేకంగా నిరంతరం పోరాడిన గొంతుక గద్దర్ అని, ఆయన పాటలు ప్రజల్లో చైతన్యాన్ని నింపి ఉద్యమాలకు దిశానిర్దేశం చేశాయని అన్నారు. గద్దర్ జయంతిని పురస్కరించుకుని ఆయన పేరుతో ఒక అవార్డును స్థాపించి, ప్రతి సంవత్సరం కవులు, కళాకారులు, సినీ రంగ ప్రముఖులకు ప్రదానం చేయాలని సిపిఐ పార్టీ నిర్ణయించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

గద్దర్ ఆలోచనలు, పాటలు, పోరాట స్ఫూర్తి తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని, ప్రజల మధ్య శాశ్వతంగా జీవిస్తాయని అన్నారు. ఆయన కలలైన సమానత్వ సమాజం కోసం ప్రతి ఒక్కరూ పోరాట పథంలో నడవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు చిరంజీవి, అశోక్, ప్రేమ్ రజక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రశాంత్ జాన్‌తో పాటు పలువురు పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొని గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News