Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:57 AM

గాంధీ పేరును తొలగించడం ప్రజాస్వామ్యంపై దాడి

గాంధీ పేరును తొలగించడం ప్రజాస్వామ్యంపై దాడి

గాంధీ పేరును తొలగించడం ప్రజాస్వామ్యంపై దాడి
December 24, 2025 05:27 PM 43 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఉపాధి హామీ చట్టం రద్దును వ్యతిరేకించిన కెవిపిఎస్

స్థానికం ప్రతినిధి

మహాత్మా గాంధీ పేరుతో దేశవ్యాప్తంగా కోట్లాది గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి, దాని స్థానంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీజీ రామ్ జీ బిల్లు దేశ ప్రజలకు అవమానకరమని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) తీవ్రంగా ఖండించింది.

ఈ బిల్లును వెంటనే రద్దు చేయాలని కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కొటారి నర్సింలు డిమాండ్ చేశారు. కొత్త చట్టంలో ఉపాధికి హామీ లేకపోవడమే కాకుండా, నిధుల కేటాయింపులపై స్పష్టత లేకపోవడం ఆందోళనకరమని ఆయన విమర్శించారు. ఈ విధానం కోట్లాది ఉపాధి కూలీల జీవన హక్కును ప్రశ్నార్థకంగా మారుస్తోందని పేర్కొన్నారు.

గత రెండు దశాబ్దాలుగా గ్రామీణ ప్రాంతాల్లో పేదల జీవనాధారంగా నిలిచిన ఉపాధి హామీ చట్టం సామాజిక భద్రతకు ప్రతీకగా మారిందని తెలిపారు. అలాంటి చట్టాన్ని తొలగించి గాంధీ పేరును వ్యవస్థ నుంచి మాయం చేయడం వెనుక ప్రజావ్యతిరేక ఆలోచన దాగి ఉందని కెవిపిఎస్ నేతలు ఆరోపించారు.

గ్రామీణ పేదల జీవన భద్రతను కాపాడాలంటే ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని, ప్రజల హక్కులను హరిస్తున్న కొత్త బిల్లును ఉపసంహరించుకోవాలని కెవిపిఎస్ స్పష్టం చేసింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News