గాంధీ పేరును తొలగించడం ప్రజాస్వామ్యంపై దాడి
గాంధీ పేరును తొలగించడం ప్రజాస్వామ్యంపై దాడి
స్థానికం బృందం
ఉపాధి హామీ చట్టం రద్దును వ్యతిరేకించిన కెవిపిఎస్
స్థానికం ప్రతినిధి
మహాత్మా గాంధీ పేరుతో దేశవ్యాప్తంగా కోట్లాది గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి, దాని స్థానంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీజీ రామ్ జీ బిల్లు దేశ ప్రజలకు అవమానకరమని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) తీవ్రంగా ఖండించింది.
ఈ బిల్లును వెంటనే రద్దు చేయాలని కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కొటారి నర్సింలు డిమాండ్ చేశారు. కొత్త చట్టంలో ఉపాధికి హామీ లేకపోవడమే కాకుండా, నిధుల కేటాయింపులపై స్పష్టత లేకపోవడం ఆందోళనకరమని ఆయన విమర్శించారు. ఈ విధానం కోట్లాది ఉపాధి కూలీల జీవన హక్కును ప్రశ్నార్థకంగా మారుస్తోందని పేర్కొన్నారు.
గత రెండు దశాబ్దాలుగా గ్రామీణ ప్రాంతాల్లో పేదల జీవనాధారంగా నిలిచిన ఉపాధి హామీ చట్టం సామాజిక భద్రతకు ప్రతీకగా మారిందని తెలిపారు. అలాంటి చట్టాన్ని తొలగించి గాంధీ పేరును వ్యవస్థ నుంచి మాయం చేయడం వెనుక ప్రజావ్యతిరేక ఆలోచన దాగి ఉందని కెవిపిఎస్ నేతలు ఆరోపించారు.
గ్రామీణ పేదల జీవన భద్రతను కాపాడాలంటే ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని, ప్రజల హక్కులను హరిస్తున్న కొత్త బిల్లును ఉపసంహరించుకోవాలని కెవిపిఎస్ స్పష్టం చేసింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి