ఏవోకు అరుదైన గౌరవం – జాతీయ స్థాయి ఇఫ్కో శిక్షణకు ఎంపిక
ఏవోకు అరుదైన గౌరవం – జాతీయ స్థాయి ఇఫ్కో శిక్షణకు ఎంపిక
GADDAM JAGANMOHAN REDDY
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల వ్యవసాయ అధికారి (ఏవో) జక్కుల ఉదయ్కు అరుదైన గౌరవం దక్కింది. బెంగళూరులో నిర్వహించనున్న ప్రతిష్టాత్మక ఇఫ్కో జాతీయ స్థాయి శిక్షణా కార్యక్రమానికి ఆయన ఎంపిక కావడం విశేషం. దేశవ్యాప్తంగా ఎంపికైన కొద్ది మంది వ్యవసాయ అధికారులతో కలిసి ఈ శిక్షణలో పాల్గొనే అవకాశాన్ని ఆయన సాధించారు.
వ్యవసాయ రంగంలో నూతన సాంకేతికతలను రైతులకు పరిచయం చేయడం లక్ష్యంగా ఈ శిక్షణను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా నానో యూరియా, నానో డీఏపీ వంటి ఆధునిక ఎరువుల వినియోగం, వాటి ప్రయోజనాలు, పంటల దిగుబడులను పెంచే విధానాలపై ప్రత్యేక అవగాహన కల్పించనున్నారు.
ఐదు రోజుల పాటు జరిగే ఈ శిక్షణలో నేర్చుకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని క్షేత్రస్థాయిలో రైతులకు చేరవేసి, సాగు ఖర్చులను తగ్గిస్తూ అధిక దిగుబడులు సాధించేలా చేయడం ప్రధాన ఉద్దేశంగా ఉంది. రైతుల సంక్షేమం కోసం నూతన పద్ధతులను అమలు చేయడంలో ముందుండే ఉదయ్కు ఈ ఎంపిక రావడం పట్ల రైతులు, సహచర అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రైతు సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తూ జాతీయ స్థాయి గుర్తింపు పొందిన జక్కుల ఉదయ్కు పలువురు రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి