ఏసీబీ వలలో మరో రెవిన్యూ శాఖ ఉద్యోగి
ఏసీబీ వలలో మరో రెవిన్యూ శాఖ ఉద్యోగి
GADDAM JAGANMOHAN REDDY
ఏపీ: కడప జిల్లా పులివెందులలో ఏసీబీ దాడులు సంచలనం సృష్టించాయి పులివెందుల ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన ఆకస్మిక దాడుల అనంతరం ఏసీబీ డీఎస్పీ సీతారామారావు మీడియాతో మాట్లాడారు కడప జిల్లా చక్రాయపేట మండలం కుమారకాల్వ గ్రామానికి చెందిన ఖాద్రియా మసీదు ఇనాం భూములు సుమారు 35 ఎకరాలు అక్రమంగా ఇతరుల పేర్లకు బదిలీ అయినట్లు ఈ భూములను తిరిగి మసీదు పేరుకు మార్చేందుకు ఫైల్ ముందుకు పంపించడానికి ఆర్డీవో కార్యాలయంలో డీటీ నాగేంద్ర కుమార్ బాధితుడు కరీముల్లా వద్ద రూ.10 వేల లంచం డిమాండ్ చేసినట్లు తెలిపారు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, డబ్బులు స్వీకరిస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అరెస్ట్ చేశామని వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న నగదును సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో మరెవరైనా ప్రమేయం ఉన్నదేమో దర్యాప్తులో వెల్లడవుతుందని ఆయన తెలిపారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి