Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 01:52 PM

ఏసీబీ వలలో భీమవరం అటవీ విభాగ అధికారి

ఏసీబీ వలలో భీమవరం అటవీ విభాగ అధికారి

ఏసీబీ వలలో భీమవరం అటవీ విభాగ అధికారి
February 24, 2026 01:09 PM 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం:

అవినీతిపై కఠిన వైఖరిని కొనసాగిస్తున్న ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరోసారి మెరుపు దాడి నిర్వహించారు. భీమవరం అటవీ విభాగంలో సెక్షన్ అధికారిగా పనిచేస్తున్న సురేష్ లంచం స్వీకరిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

నాలుగు లక్షల రూపాయల లంచం డిమాండ్

ఒక పని నిమిత్తం బాధితుడి నుంచి రూ. 4 లక్షలు లంచంగా డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా, డీఎస్పీ నేతృత్వంలోని బృందం పక్కా ప్రణాళికతో ఉచ్చుపన్నింది.

సురేష్ తన కార్యాలయంలోనే బాధితుడి నుంచి నగదు స్వీకరిస్తుండగా అధికారులు ఆకస్మికంగా దాడి చేసి పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి రూ. 4 లక్షల లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.

గతంలో చింతలపూడి సేవలు

సురేష్ గతంలో చింతలపూడి అటవీ సెక్షన్‌లో విధులు నిర్వర్తించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన కార్యాలయం మరియు నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ఈ తనిఖీల్లో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.

“అవినీతికి తావు లేదు”

“అవినీతికి పాల్పడితే ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదు” అని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. జిల్లాలో ఈ ఘటన సంచలనం రేపింది.

ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News