PRINT TIME: March 28, 2026 09:56 PM
ఎస్సై నరేష్ చేతుల మీదుగా మత్తు వ్యతిరేక పోస్టర్ల ఆవిష్కరణ
ఎస్సై నరేష్ చేతుల మీదుగా మత్తు వ్యతిరేక పోస్టర్ల ఆవిష్కరణ
March 28, 2026 08:12 PM
30 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహీర్ మండల కేంద్రంలో శనివారం ఎస్సై నరేష్ను నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ – సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా సంస్థ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బైండ్ల కృష్ణ, జిల్లా ఆర్టీఐ అధ్యక్షుడు పడకంటి శ్రీశైలం, న్యాల్కల్ మండల అధ్యక్షుడు నవీన్ కుమార్, ప్రధాన కార్యదర్శి సంగమేశ్వర్ కలిసి మర్యాదపూర్వకంగా శాలువాతో సన్మానించారు. అనంతరం ఎస్సై నరేష్ చేతుల మీదుగా మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పోస్టర్లను ఆవిష్కరించారు. యువత భవిష్యత్తును కాపాడేందుకు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, సమాజం మొత్తం కలిసి ఈ సమస్యను ఎదుర్కోవాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గురుజువాడ గ్రామ సర్పంచ్, తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి