Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపాలిటీకి రూ.54.75 కోట్ల బడ్జెట్ ఆమోదం అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ పుస్తకాల కోసం ఇల్లు కట్టిన విశ్వ రత్న: డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ అక్షర యాత్ర “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” 6లోగా అప్లై చేసుకోండి – జర్నలిస్టులకు అక్రెడిటేషన్ గడువు శ్రీరామ నవమి సందర్భంగా సుద్దకుంటపల్లి గ్రామంలో ఆంజనేయస్వామి విగ్రహ ఊరేగింపు ఘనంగా “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 28, 2026 09:56 PM

ఎస్సై నరేష్ చేతుల మీదుగా మత్తు వ్యతిరేక పోస్టర్ల ఆవిష్కరణ

ఎస్సై నరేష్ చేతుల మీదుగా మత్తు వ్యతిరేక పోస్టర్ల ఆవిష్కరణ

ఎస్సై నరేష్ చేతుల మీదుగా మత్తు వ్యతిరేక పోస్టర్ల ఆవిష్కరణ
March 28, 2026 08:12 PM 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహీర్ మండల కేంద్రంలో శనివారం ఎస్సై నరేష్‌ను నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ – సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా సంస్థ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బైండ్ల కృష్ణ, జిల్లా ఆర్టీఐ అధ్యక్షుడు పడకంటి శ్రీశైలం, న్యాల్‌కల్ మండల అధ్యక్షుడు నవీన్ కుమార్, ప్రధాన కార్యదర్శి సంగమేశ్వర్ కలిసి మర్యాదపూర్వకంగా శాలువాతో సన్మానించారు. అనంతరం ఎస్సై నరేష్ చేతుల మీదుగా మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పోస్టర్లను ఆవిష్కరించారు. యువత భవిష్యత్తును కాపాడేందుకు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, సమాజం మొత్తం కలిసి ఈ సమస్యను ఎదుర్కోవాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గురుజువాడ గ్రామ సర్పంచ్, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News