Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పిప్పడపల్లి గ్రామంలో హత్యాయత్నం ఘటన – నలుగురిపై కేసు నమోదు TGPSC UPSCలా మారాలి, రిటైర్మెంట్ 58కి, ₹5016 భృతి.. SC/ST బ్యాక్‌లాగ్‌తో 2L ఉద్యోగాలు: TNVP డిమాండ్లు లండన్‌లో అంబేద్కర్ మ్యూజియం భారత గొప్ప గుర్తింపు : రేలారే గంగా స్మార్ట్ మీటర్లు కాదు, స్మార్ట్ స్కూళ్లు కావాలి : రాఘవ్ చద్దా ప్రశ్న దేశ లొంగవిస్తోంది! “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” సోమందేపల్లిలో రంజాన్ శుభారంభం – భక్తి శ్రద్ధల మధ్య ర్యాలీ ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం – 16వ వసంతోత్సవాలు క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 26, 2026 10:03 PM

ఎస్.ఐ.ఆర్ ప్రక్రియలో రాజకీయ పార్టీల సహకారం కీలకం – జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

ఎస్.ఐ.ఆర్ ప్రక్రియలో రాజకీయ పార్టీల సహకారం కీలకం – జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

ఎస్.ఐ.ఆర్ ప్రక్రియలో రాజకీయ పార్టీల సహకారం కీలకం – జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
March 26, 2026 08:23 PM 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వచ్చే ఏప్రిల్ నెలలో ప్రారంభం కానున్న ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా,సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు.గురువారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ,ఓటరు జాబితా సవరణలో అర్హత ఉన్న ప్రతి పౌరుని పేరు తప్పకుండా నమోదు కావడం అత్యంత ముఖ్యమని, ఎలాంటి పొరపాట్లు లేకుండా ఖచ్చితమైన జాబితా సిద్ధం చేయాలని సూచించారు. ఈ ప్రక్రియలో క్షేత్ర స్థాయి అధికారులు మరియు రాజకీయ పార్టీల తరపున నియమించే ప్రతినిధుల పాత్ర కీలకమని, అందువల్ల ప్రతి పోలింగ్ కేంద్రానికి ప్రతినిధులను ఈ నెల 30లోగా నియమించి వారి వివరాలను నియోజకవర్గాల వారీగా సమర్పించాలని కోరారు.ప్రతినిధుల నియామకం అనంతరం క్షేత్ర స్థాయి అధికారులతో కలిసి సమావేశాలు నిర్వహించి విధానాలపై పూర్తి అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమాన్ని ఎటువంటి లోపాలు లేకుండా సజావుగా నిర్వహించేందుకు అధికారులు, రాజకీయ పార్టీలు సమన్వయంతో పనిచేయాలని ఆమె సూచించారు.సమావేశంలో అదనపు కలెక్టర్ మాధురి, ఎన్నికల విభాగపు అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News