ఎస్.ఐ.ఆర్ ప్రక్రియలో రాజకీయ పార్టీల సహకారం కీలకం – జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
ఎస్.ఐ.ఆర్ ప్రక్రియలో రాజకీయ పార్టీల సహకారం కీలకం – జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
Krishna
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వచ్చే ఏప్రిల్ నెలలో ప్రారంభం కానున్న ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా,సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు.గురువారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ,ఓటరు జాబితా సవరణలో అర్హత ఉన్న ప్రతి పౌరుని పేరు తప్పకుండా నమోదు కావడం అత్యంత ముఖ్యమని, ఎలాంటి పొరపాట్లు లేకుండా ఖచ్చితమైన జాబితా సిద్ధం చేయాలని సూచించారు. ఈ ప్రక్రియలో క్షేత్ర స్థాయి అధికారులు మరియు రాజకీయ పార్టీల తరపున నియమించే ప్రతినిధుల పాత్ర కీలకమని, అందువల్ల ప్రతి పోలింగ్ కేంద్రానికి ప్రతినిధులను ఈ నెల 30లోగా నియమించి వారి వివరాలను నియోజకవర్గాల వారీగా సమర్పించాలని కోరారు.ప్రతినిధుల నియామకం అనంతరం క్షేత్ర స్థాయి అధికారులతో కలిసి సమావేశాలు నిర్వహించి విధానాలపై పూర్తి అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమాన్ని ఎటువంటి లోపాలు లేకుండా సజావుగా నిర్వహించేందుకు అధికారులు, రాజకీయ పార్టీలు సమన్వయంతో పనిచేయాలని ఆమె సూచించారు.సమావేశంలో అదనపు కలెక్టర్ మాధురి, ఎన్నికల విభాగపు అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి