Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:58 PM

ఎస్.ఐ.ఆర్ ప్రక్రియలో రాజకీయ పార్టీల సహకారం కీలకం – జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

ఎస్.ఐ.ఆర్ ప్రక్రియలో రాజకీయ పార్టీల సహకారం కీలకం – జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

ఎస్.ఐ.ఆర్ ప్రక్రియలో రాజకీయ పార్టీల సహకారం కీలకం – జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
March 26, 2026 08:23 PM 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వచ్చే ఏప్రిల్ నెలలో ప్రారంభం కానున్న ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా,సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు.గురువారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ,ఓటరు జాబితా సవరణలో అర్హత ఉన్న ప్రతి పౌరుని పేరు తప్పకుండా నమోదు కావడం అత్యంత ముఖ్యమని, ఎలాంటి పొరపాట్లు లేకుండా ఖచ్చితమైన జాబితా సిద్ధం చేయాలని సూచించారు. ఈ ప్రక్రియలో క్షేత్ర స్థాయి అధికారులు మరియు రాజకీయ పార్టీల తరపున నియమించే ప్రతినిధుల పాత్ర కీలకమని, అందువల్ల ప్రతి పోలింగ్ కేంద్రానికి ప్రతినిధులను ఈ నెల 30లోగా నియమించి వారి వివరాలను నియోజకవర్గాల వారీగా సమర్పించాలని కోరారు.ప్రతినిధుల నియామకం అనంతరం క్షేత్ర స్థాయి అధికారులతో కలిసి సమావేశాలు నిర్వహించి విధానాలపై పూర్తి అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమాన్ని ఎటువంటి లోపాలు లేకుండా సజావుగా నిర్వహించేందుకు అధికారులు, రాజకీయ పార్టీలు సమన్వయంతో పనిచేయాలని ఆమె సూచించారు.సమావేశంలో అదనపు కలెక్టర్ మాధురి, ఎన్నికల విభాగపు అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News