Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్సు పోయింది.. దొరికితే సమాచారం ఇవ్వండి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 03:54 AM

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్.

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్.

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్.
08-02-2026 96 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

విజయానికి తొలి మెట్టు ఎస్ఎఫ్ఐ టాలెంట్ టెస్ట్

పదవ తరగతి విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని తొలగించి ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు సిద్ధం చేయడమే లక్ష్యంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నామని ఎస్ఎఫ్ఐ జాతీయ కమిటీ సభ్యురాలు మేడబోయిన మమత, మాజీ జిల్లా కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం తెలిపారు.స్థానిక శ్రీహిందు కళాశాలలో జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్ నిర్వహించగా మండల వ్యాప్తంగా వివిధ పాఠశాలల నుంచి 210 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామీణ విద్యార్థులు భయంతో కాకుండా ధైర్యంగా పదవ తరగతి పరీక్షలు రాయడానికి ఈ టాలెంట్ టెస్ట్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు.ఇప్పటివరకు చదివిన పాఠ్యాంశాలను పునఃచరణ చేసుకోవాలని, సమయాన్ని వృథా చేయకుండా క్రమశిక్షణతో చదవాలని సూచించారు. వెనుకబడుతున్న విషయాలను గుర్తించి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. విద్యార్థుల సమస్యలపై ఎస్ఎఫ్ఐ నిరంతరం పోరాటం చేస్తూ, వారి సృజనాత్మక శక్తిని వెలికితీసి ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు.


ఈ కార్యక్రమంలో తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య మండల అధ్యక్షులు నీలం శేఖర్, మండల నాయకులు మేడి మధుబాబు, ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి పుట్టల ఉదయ్ కుమార్, పిట్టల నవీన్ కుమార్, సృజన, బోలుగుల శివమణి, శివరాత్రి మణికంఠ, శివరాత్రి విఘ్నేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్.

Article Image

విజయానికి తొలి మెట్టు ఎస్ఎఫ్ఐ టాలెంట్ టెస్ట్

పదవ తరగతి విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని తొలగించి ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు సిద్ధం చేయడమే లక్ష్యంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నామని ఎస్ఎఫ్ఐ జాతీయ కమిటీ సభ్యురాలు మేడబోయిన మమత, మాజీ జిల్లా కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం తెలిపారు.స్థానిక శ్రీహిందు కళాశాలలో జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్ నిర్వహించగా మండల వ్యాప్తంగా వివిధ పాఠశాలల నుంచి 210 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామీణ విద్యార్థులు భయంతో కాకుండా ధైర్యంగా పదవ తరగతి పరీక్షలు రాయడానికి ఈ టాలెంట్ టెస్ట్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు.ఇప్పటివరకు చదివిన పాఠ్యాంశాలను పునఃచరణ చేసుకోవాలని, సమయాన్ని వృథా చేయకుండా క్రమశిక్షణతో చదవాలని సూచించారు. వెనుకబడుతున్న విషయాలను గుర్తించి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. విద్యార్థుల సమస్యలపై ఎస్ఎఫ్ఐ నిరంతరం పోరాటం చేస్తూ, వారి సృజనాత్మక శక్తిని వెలికితీసి ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు.


ఈ కార్యక్రమంలో తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య మండల అధ్యక్షులు నీలం శేఖర్, మండల నాయకులు మేడి మధుబాబు, ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి పుట్టల ఉదయ్ కుమార్, పిట్టల నవీన్ కుమార్, సృజన, బోలుగుల శివమణి, శివరాత్రి మణికంఠ, శివరాత్రి విఘ్నేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News