Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణలో ఉద్యోగాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. డివైఎఫ్ఐ. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 12:05 PM

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్.

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్.

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్.
February 08, 2026 04:20 PM 84 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

విజయానికి తొలి మెట్టు ఎస్ఎఫ్ఐ టాలెంట్ టెస్ట్

పదవ తరగతి విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని తొలగించి ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు సిద్ధం చేయడమే లక్ష్యంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నామని ఎస్ఎఫ్ఐ జాతీయ కమిటీ సభ్యురాలు మేడబోయిన మమత, మాజీ జిల్లా కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం తెలిపారు.స్థానిక శ్రీహిందు కళాశాలలో జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్ నిర్వహించగా మండల వ్యాప్తంగా వివిధ పాఠశాలల నుంచి 210 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామీణ విద్యార్థులు భయంతో కాకుండా ధైర్యంగా పదవ తరగతి పరీక్షలు రాయడానికి ఈ టాలెంట్ టెస్ట్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు.ఇప్పటివరకు చదివిన పాఠ్యాంశాలను పునఃచరణ చేసుకోవాలని, సమయాన్ని వృథా చేయకుండా క్రమశిక్షణతో చదవాలని సూచించారు. వెనుకబడుతున్న విషయాలను గుర్తించి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. విద్యార్థుల సమస్యలపై ఎస్ఎఫ్ఐ నిరంతరం పోరాటం చేస్తూ, వారి సృజనాత్మక శక్తిని వెలికితీసి ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు.


ఈ కార్యక్రమంలో తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య మండల అధ్యక్షులు నీలం శేఖర్, మండల నాయకులు మేడి మధుబాబు, ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి పుట్టల ఉదయ్ కుమార్, పిట్టల నవీన్ కుమార్, సృజన, బోలుగుల శివమణి, శివరాత్రి మణికంఠ, శివరాత్రి విఘ్నేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News