Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా పూలే జయంతి – సమానత్వం కోసం కృషి చేయాలి కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 04:21 PM

ఎరువుల దుకాణంపై జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

ఎరువుల దుకాణంపై జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

ఎరువుల దుకాణంపై జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
February 05, 2026 06:32 PM 82 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

నాగారం మండల కేంద్రంలో ఆగ్రోస్ రైతు సేవ కేంద్రం పరిశీలన

గురువారం నాగారం మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవ కేంద్రం ఎరువుల దుకాణాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టాక్ రిజిస్టర్‌ను పరిశీలించి, దుకాణంలో ఉన్న ఎరువుల నిల్వలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్టాక్ రిజిస్టర్ల ప్రకారం నాలుగు వందల ముప్పై యూరియా బస్తాలు నిల్వలో ఉన్నట్లు నమోదు చేయడాన్ని గమనించిన జిల్లా కలెక్టర్ యూరియా నిల్వలను స్వయంగా పరిశీలించారు. కొనుగోలు యాప్ ద్వారా రైతులకు యూరియా విక్రయాలు జరుగుతున్నాయా లేదా అని ఏవో కృష్ణ కాంత్ ని అడిగి తెలుసుకున్నారు.అదేవిధంగా ఈ యాప్ రైతులకు లాభదాయకంగా ఉందా, యూరియా సరఫరా సక్రమంగా జరుగుతుందా అనే విషయాలపై డీలర్ ఉపేందర్ ని జిల్లా కలెక్టర్ గారు ప్రశ్నించారు.సీజన్ సమయంలో ఎలాంటి కొరత లేకుండా రైతులకు సకాలంలో ఎరువులు అందేలా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News