ఎరువుల దుకాణంపై జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
ఎరువుల దుకాణంపై జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
Biksham
నాగారం మండల కేంద్రంలో ఆగ్రోస్ రైతు సేవ కేంద్రం పరిశీలన
గురువారం నాగారం మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవ కేంద్రం ఎరువుల దుకాణాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టాక్ రిజిస్టర్ను పరిశీలించి, దుకాణంలో ఉన్న ఎరువుల నిల్వలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్టాక్ రిజిస్టర్ల ప్రకారం నాలుగు వందల ముప్పై యూరియా బస్తాలు నిల్వలో ఉన్నట్లు నమోదు చేయడాన్ని గమనించిన జిల్లా కలెక్టర్ యూరియా నిల్వలను స్వయంగా పరిశీలించారు. కొనుగోలు యాప్ ద్వారా రైతులకు యూరియా విక్రయాలు జరుగుతున్నాయా లేదా అని ఏవో కృష్ణ కాంత్ ని అడిగి తెలుసుకున్నారు.అదేవిధంగా ఈ యాప్ రైతులకు లాభదాయకంగా ఉందా, యూరియా సరఫరా సక్రమంగా జరుగుతుందా అనే విషయాలపై డీలర్ ఉపేందర్ ని జిల్లా కలెక్టర్ గారు ప్రశ్నించారు.సీజన్ సమయంలో ఎలాంటి కొరత లేకుండా రైతులకు సకాలంలో ఎరువులు అందేలా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి