ఈఏపీసిఈటి లో శ్రీ గాయత్రి విద్యార్థుల ప్రతిభ
ఈఏపీసిఈటి లో శ్రీ గాయత్రి విద్యార్థుల ప్రతిభ
K.RAVI
రాష్ట్రస్థాయి ర్యాంకులతో మెరిసిన చౌటుప్పల్ కళాశాల విజేతలకు ఘన సన్మానం..
తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన టీజీ ఈఎపిసిఈటి -2026 ఫలితాల్లో చౌటుప్పల్లోని శ్రీ గాయత్రి జూనియర్ కళాశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు. బుధవారం కళాశాల ప్రాంగణంలో ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఫలితాల్లో ఎం.లిఖిత 3101వ ర్యాంకు, డి.వైష్ణవి 6471వ ర్యాంకు, వి.తన్విజ 7332వ ర్యాంకు, ఎ.భాను 13754వ ర్యాంకు సాధించి కళాశాలకు మంచి పేరు తీసుకువచ్చారు. అదేవిధంగా 15 వేల నుంచి 25 వేల మధ్య సుమారు 30 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించగా, మొత్తం 100 మందికి పైగా విద్యార్థులు అర్హత సాధించడం విశేషమని కళాశాల యాజమాన్యం తెలిపింది.ఈ సందర్భంగా కళాశాలల చైర్మన్ బండారు మయూర్ రెడ్డి మాట్లాడుతూ.. “చదువే జీవితాన్ని మార్చే శక్తి. సమయాన్ని వృథా చేయకుండా కష్టపడి చదివితేనే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చు” అని విద్యార్థులకు సూచించారు.
కళాశాల కరస్పాండెంట్ భీమిడి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ.. చౌటుప్పల్లో కళాశాల స్థాపించి పదేళ్లు పూర్తయ్యాయని, ఇక్కడ చదివిన విద్యార్థులు దేశ విదేశాల్లో వైద్యులు, ఇంజినీర్లు, అకౌంటెంట్లుగా స్థిరపడటం గర్వకారణమన్నారు. క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్య వల్లే ఐఐటీ, నీట్, ఎప్సెట్ పరీక్షల్లో రాష్ట్రస్థాయి ఫలితాలు సాధిస్తున్నామని పేర్కొన్నారు.
విద్యార్థులకు పుష్పగుచ్ఛాలు అందించి, మిఠాయిలు తినిపించి అభినందించారు.ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ దయాకర్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఆంజనేయులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి