Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:05 AM

ఈఏపీసిఈటి లో శ్రీ గాయత్రి విద్యార్థుల ప్రతిభ

ఈఏపీసిఈటి లో శ్రీ గాయత్రి విద్యార్థుల ప్రతిభ

ఈఏపీసిఈటి లో శ్రీ గాయత్రి విద్యార్థుల ప్రతిభ
20-05-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రాష్ట్రస్థాయి ర్యాంకులతో మెరిసిన చౌటుప్పల్ కళాశాల విజేతలకు ఘన సన్మానం..

తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన టీజీ ఈఎపిసిఈటి -2026 ఫలితాల్లో చౌటుప్పల్‌లోని శ్రీ గాయత్రి జూనియర్ కళాశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు. బుధవారం కళాశాల ప్రాంగణంలో ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఫలితాల్లో ఎం.లిఖిత 3101వ ర్యాంకు, డి.వైష్ణవి 6471వ ర్యాంకు, వి.తన్విజ 7332వ ర్యాంకు, ఎ.భాను 13754వ ర్యాంకు సాధించి కళాశాలకు మంచి పేరు తీసుకువచ్చారు. అదేవిధంగా 15 వేల నుంచి 25 వేల మధ్య సుమారు 30 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించగా, మొత్తం 100 మందికి పైగా విద్యార్థులు అర్హత సాధించడం విశేషమని కళాశాల యాజమాన్యం తెలిపింది.ఈ సందర్భంగా కళాశాలల చైర్మన్ బండారు మయూర్ రెడ్డి మాట్లాడుతూ.. “చదువే జీవితాన్ని మార్చే శక్తి. సమయాన్ని వృథా చేయకుండా కష్టపడి చదివితేనే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చు” అని విద్యార్థులకు సూచించారు.

కళాశాల కరస్పాండెంట్ భీమిడి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ.. చౌటుప్పల్‌లో కళాశాల స్థాపించి పదేళ్లు పూర్తయ్యాయని, ఇక్కడ చదివిన విద్యార్థులు దేశ విదేశాల్లో వైద్యులు, ఇంజినీర్లు, అకౌంటెంట్లుగా స్థిరపడటం గర్వకారణమన్నారు. క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్య వల్లే ఐఐటీ, నీట్, ఎప్సెట్ పరీక్షల్లో రాష్ట్రస్థాయి ఫలితాలు సాధిస్తున్నామని పేర్కొన్నారు.

విద్యార్థులకు పుష్పగుచ్ఛాలు అందించి, మిఠాయిలు తినిపించి అభినందించారు.ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ దయాకర్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఆంజనేయులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

ఈఏపీసిఈటి లో శ్రీ గాయత్రి విద్యార్థుల ప్రతిభ

Article Image

రాష్ట్రస్థాయి ర్యాంకులతో మెరిసిన చౌటుప్పల్ కళాశాల విజేతలకు ఘన సన్మానం..

తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన టీజీ ఈఎపిసిఈటి -2026 ఫలితాల్లో చౌటుప్పల్‌లోని శ్రీ గాయత్రి జూనియర్ కళాశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు. బుధవారం కళాశాల ప్రాంగణంలో ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఫలితాల్లో ఎం.లిఖిత 3101వ ర్యాంకు, డి.వైష్ణవి 6471వ ర్యాంకు, వి.తన్విజ 7332వ ర్యాంకు, ఎ.భాను 13754వ ర్యాంకు సాధించి కళాశాలకు మంచి పేరు తీసుకువచ్చారు. అదేవిధంగా 15 వేల నుంచి 25 వేల మధ్య సుమారు 30 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించగా, మొత్తం 100 మందికి పైగా విద్యార్థులు అర్హత సాధించడం విశేషమని కళాశాల యాజమాన్యం తెలిపింది.ఈ సందర్భంగా కళాశాలల చైర్మన్ బండారు మయూర్ రెడ్డి మాట్లాడుతూ.. “చదువే జీవితాన్ని మార్చే శక్తి. సమయాన్ని వృథా చేయకుండా కష్టపడి చదివితేనే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చు” అని విద్యార్థులకు సూచించారు.

కళాశాల కరస్పాండెంట్ భీమిడి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ.. చౌటుప్పల్‌లో కళాశాల స్థాపించి పదేళ్లు పూర్తయ్యాయని, ఇక్కడ చదివిన విద్యార్థులు దేశ విదేశాల్లో వైద్యులు, ఇంజినీర్లు, అకౌంటెంట్లుగా స్థిరపడటం గర్వకారణమన్నారు. క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్య వల్లే ఐఐటీ, నీట్, ఎప్సెట్ పరీక్షల్లో రాష్ట్రస్థాయి ఫలితాలు సాధిస్తున్నామని పేర్కొన్నారు.

విద్యార్థులకు పుష్పగుచ్ఛాలు అందించి, మిఠాయిలు తినిపించి అభినందించారు.ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ దయాకర్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఆంజనేయులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News