Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 02:46 PM

ఈఏపీసిఈటి లో శ్రీ గాయత్రి విద్యార్థుల ప్రతిభ

ఈఏపీసిఈటి లో శ్రీ గాయత్రి విద్యార్థుల ప్రతిభ

ఈఏపీసిఈటి లో శ్రీ గాయత్రి విద్యార్థుల ప్రతిభ
May 20, 2026 04:51 PM 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రాష్ట్రస్థాయి ర్యాంకులతో మెరిసిన చౌటుప్పల్ కళాశాల విజేతలకు ఘన సన్మానం..

తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన టీజీ ఈఎపిసిఈటి -2026 ఫలితాల్లో చౌటుప్పల్‌లోని శ్రీ గాయత్రి జూనియర్ కళాశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు. బుధవారం కళాశాల ప్రాంగణంలో ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఫలితాల్లో ఎం.లిఖిత 3101వ ర్యాంకు, డి.వైష్ణవి 6471వ ర్యాంకు, వి.తన్విజ 7332వ ర్యాంకు, ఎ.భాను 13754వ ర్యాంకు సాధించి కళాశాలకు మంచి పేరు తీసుకువచ్చారు. అదేవిధంగా 15 వేల నుంచి 25 వేల మధ్య సుమారు 30 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించగా, మొత్తం 100 మందికి పైగా విద్యార్థులు అర్హత సాధించడం విశేషమని కళాశాల యాజమాన్యం తెలిపింది.ఈ సందర్భంగా కళాశాలల చైర్మన్ బండారు మయూర్ రెడ్డి మాట్లాడుతూ.. “చదువే జీవితాన్ని మార్చే శక్తి. సమయాన్ని వృథా చేయకుండా కష్టపడి చదివితేనే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చు” అని విద్యార్థులకు సూచించారు.

కళాశాల కరస్పాండెంట్ భీమిడి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ.. చౌటుప్పల్‌లో కళాశాల స్థాపించి పదేళ్లు పూర్తయ్యాయని, ఇక్కడ చదివిన విద్యార్థులు దేశ విదేశాల్లో వైద్యులు, ఇంజినీర్లు, అకౌంటెంట్లుగా స్థిరపడటం గర్వకారణమన్నారు. క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్య వల్లే ఐఐటీ, నీట్, ఎప్సెట్ పరీక్షల్లో రాష్ట్రస్థాయి ఫలితాలు సాధిస్తున్నామని పేర్కొన్నారు.

విద్యార్థులకు పుష్పగుచ్ఛాలు అందించి, మిఠాయిలు తినిపించి అభినందించారు.ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ దయాకర్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఆంజనేయులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News