Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 02:45 PM

ఏపీఎస్ఆర్టీసీ బస్సులో జాయింట్ కలెక్టర్ ప్రయాణం

ఏపీఎస్ఆర్టీసీ బస్సులో జాయింట్ కలెక్టర్ ప్రయాణం

ఏపీఎస్ఆర్టీసీ బస్సులో జాయింట్ కలెక్టర్ ప్రయాణం
May 18, 2026 12:25 PM 59 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.మౌర్య భరద్వాజ్ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. 'నో వెహికల్ డే' (No Vehicle Day) ను పాటిస్తూ, పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించాలనే సందేశంతో ఆయన సోమవారం తన క్యాంపు కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) బస్సులో సామాన్య ప్రయాణికుడిలా ప్రయాణించారు.

బస్సులో ప్రయాణించి కలెక్టరేట్‌కు చేరుకున్న జాయింట్ కలెక్టర్, నేరుగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) హాల్‌కు చేరుకుని అర్జీలను స్వీకరించారు. కాలుష్య నివారణకు, ఇంధన వనరుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా వారంలో ఒకరోజు సొంత వాహనాలకు దూరంగా ఉండి, ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకోవాలని ఈ సందర్భంగా జేసీ పిలుపునిచ్చారు. ఉన్నతాధికారి స్వయంగా బస్సులో ప్రయాణించి ఆదర్శంగా నిలవడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News