ఏప్రిల్లోనే మూడు నెలల రేషన్ పంపిణీ
ఏప్రిల్లోనే మూడు నెలల రేషన్ పంపిణీ
K.RAVI
ఏప్రిల్–మే–జూన్ బియ్యం ఒకేసారి అందజేత లబ్ధిదారులు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఏప్రిల్ 2026లోనే పంపిణీ చేయనున్నట్లు కలెక్టరు (పౌరసరఫరాలు) వెంకా రెడ్డి తెలిపారు. రేషన్ లబ్ధిదారులు తమకు కేటాయించిన మూడు నెలల బియ్యం కోటాను ఏప్రిల్ నెలలోనే రేషన్ దుకాణాల నుంచి తీసుకోవాలని సూచించారు.లబ్ధిదారులు పెద్ద మొత్తంలో బియ్యం పొందాల్సి ఉండటంతో సంచులు, రవాణా సౌకర్యం ముందుగానే సిద్ధం చేసుకోవాలని కోరారు. జిల్లాలోని 2,50,789 రేషన్ కార్డులకు చెందిన 7,91,142 యూనిట్లకు గాను మొత్తం 15,031.035 మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయించినట్లు వెల్లడించారు.
అనంతరం కలెక్టరు వెంకా రెడ్డి వలిగొండ మండలంలోని గన్ని గోదాము, బఫర్ గోదాము, పెట్రోల్ బంకు, వాసవి రైస్ మిల్లను తనిఖీ చేసి నిల్వలు, సరఫరా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి