ఏప్రిల్ 14 సభ విజయానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు – ప్రతి గ్రామం నుంచి హాజరు కావాలని పిలుపు
ఏప్రిల్ 14 సభ విజయానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు – ప్రతి గ్రామం నుంచి హాజరు కావాలని పిలుపు
K.RAVI
మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ మండలంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 14న జరగనున్న భారీ సభకు సంబంధించిన పోస్టర్ను నాయకులుఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోఆర్డినేటర్ చంద్రశేఖర్ ముదిరాజ్ మాట్లాడుతూ, ఏప్రిల్ 14న జరిగే సభకు మునుగోడు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి భారీగా కార్యకర్తలు హాజరు కావాలని పిలుపునిచ్చారు. మహనీయుల ఆశయాలను నెరవేర్చడం ప్రతి బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్త బాధ్యత అని ఆయన అన్నారు. వచ్చే పది రోజుల్లో పార్టీ కోసం కృషి చేసే కార్యకర్తలకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించాలని సూచించారు.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంచాల శ్రీకాంత్ మాట్లాడుతూ, సభను విజయవంతం చేయడానికి సమన్వయం, క్రమశిక్షణతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ప్రభు కుమార్, జిల్లా ఇంచార్జి బొడ్డు కిరణ్, నల్గొండ జిల్లా కార్యదర్శి కత్తుల పరమేష్, మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు తగరం సుభాష్ చంద్రబోస్, ఉపాధ్యక్షుడు సుక్క రాములు, కోశాధికారి మాధ రమేష్, మండల ఉపాధ్యక్షుడు మస్కు ఉదయ్ కిరణ్, మున్సిపల్ అధ్యక్షుడు బాబు, సాయి తేజ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి