Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కంది మండలం జుల్కల్ గ్రామంలో విషాద ఘటన – తల్లి, ఇద్దరు చిన్నారుల మృతి అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ పుస్తకాల కోసం ఇల్లు కట్టిన విశ్వ రత్న: డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ అక్షర యాత్ర “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” 6లోగా అప్లై చేసుకోండి – జర్నలిస్టులకు అక్రెడిటేషన్ గడువు శ్రీరామ నవమి సందర్భంగా సుద్దకుంటపల్లి గ్రామంలో ఆంజనేయస్వామి విగ్రహ ఊరేగింపు ఘనంగా “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 29, 2026 01:14 AM

ఏప్రిల్ 14 సభ విజయానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు – ప్రతి గ్రామం నుంచి హాజరు కావాలని పిలుపు

ఏప్రిల్ 14 సభ విజయానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు – ప్రతి గ్రామం నుంచి హాజరు కావాలని పిలుపు

ఏప్రిల్ 14 సభ విజయానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు – ప్రతి గ్రామం నుంచి హాజరు కావాలని పిలుపు
March 28, 2026 11:34 PM 5 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ మండలంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 14న జరగనున్న భారీ సభకు సంబంధించిన పోస్టర్‌ను నాయకులుఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోఆర్డినేటర్ చంద్రశేఖర్ ముదిరాజ్ మాట్లాడుతూ, ఏప్రిల్ 14న జరిగే సభకు మునుగోడు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి భారీగా కార్యకర్తలు హాజరు కావాలని పిలుపునిచ్చారు. మహనీయుల ఆశయాలను నెరవేర్చడం ప్రతి బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్త బాధ్యత అని ఆయన అన్నారు. వచ్చే పది రోజుల్లో పార్టీ కోసం కృషి చేసే కార్యకర్తలకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించాలని సూచించారు.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంచాల శ్రీకాంత్ మాట్లాడుతూ, సభను విజయవంతం చేయడానికి సమన్వయం, క్రమశిక్షణతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ప్రభు కుమార్, జిల్లా ఇంచార్జి బొడ్డు కిరణ్, నల్గొండ జిల్లా కార్యదర్శి కత్తుల పరమేష్, మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు తగరం సుభాష్ చంద్రబోస్, ఉపాధ్యక్షుడు సుక్క రాములు, కోశాధికారి మాధ రమేష్, మండల ఉపాధ్యక్షుడు మస్కు ఉదయ్ కిరణ్, మున్సిపల్ అధ్యక్షుడు బాబు, సాయి తేజ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News