ఈనెల 28న లోక్ అదాలత్ – ప్రజలకు సువర్ణావకాశం
ఈనెల 28న లోక్ అదాలత్ – ప్రజలకు సువర్ణావకాశం
Krishna
అందోల్ నియోజకవర్గంలోని రాయికోడ్ మండల స్థానిక పోలీస్ కార్యాలయంలో ఎస్సై చైతన్య కిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు. రాయికోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలకు తెలియజేయునది ఏమనగా, ఈనెల 28.03.2026 తేదీన నిర్వహించబడుతున్న జాతీయ లోక్ అదాలత్ ఒక మంచి అవకాశమని పేర్కొన్నారు.ఈ లోక్ అదాలత్ ద్వారా ప్రజలు తమ పెండింగ్లో ఉన్న కేసులను రాజీ మార్గంలో సులభంగా, త్వరితగతిన పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ముఖ్యంగా ట్రాఫిక్ చలాన్లు, చిన్నపాటి క్రిమినల్ కేసులు, సివిల్ వివాదాలు, కుటుంబ సంబంధిత కేసులు వంటి అనేక అంశాలు పరస్పర ఒప్పందంతో తక్కువ సమయంలో పరిష్కారం పొందవచ్చని వివరించారు. దీర్ఘకాలంగా కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులు కూడా ఈ వేదిక ద్వారా త్వరగా ముగింపు పొందే అవకాశం ఉందన్నారు.ప్రజలు న్యాయవాదులు, పోలీస్ అధికారులు మరియు సంబంధిత శాఖల అధికారులతో సంప్రదించి తమ కేసులను లోక్ అదాలత్లో పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియ ద్వారా సమయం, ధనం ఆదా అవుతుందని, అనవసరంగా కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని తెలిపారు.అందువల్ల రాయికోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ కేసులను సత్వర పరిష్కారం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి