Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:52 PM

ఈనెల 22న చెన్నైలో జరిగే ప్రపంచ శాంతి సభను విజయవంతం చేయాలి"

ఈనెల 22న చెన్నైలో జరిగే ప్రపంచ శాంతి సభను విజయవంతం చేయాలి"

ఈనెల 22న  చెన్నైలో జరిగే ప్రపంచ శాంతి సభను విజయవంతం చేయాలి"
February 20, 2026 09:00 PM 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

ప్రజా సంఘాల సమితి రాష్ట్ర నాయకులు బుగ్గ మైసయ్య

భువనగిరి టౌన్:ప్రపంచంలో ప్రస్తుత పరిస్థితుల్లో శాంతి, స్వేచ్ఛా,సమానత్వం చాలా ప్రధానమైన అవసరమని తెలంగాణ ప్రజా సంఘాల సమితి రాష్ట్ర నాయకులు బుగ్గ మైసయ్య అన్నారు. ప్రపంచ శాంతి కోరుతూ తమిళనాడు రాజధాని కేంద్రమైన చెన్నైలో ఈనెల 22వ తేదీన భారీ సమావేశం జరుగుతున్నదని, ఇట్టి సమావేశానికి ప్రపంచ వ్యాప్తంగా వివిధదేశాల ప్రతినిధులు హాజరు కానున్నారని అన్నారు. దీనికి సంఘీభావంగా తెలంగాణ రాష్ట్రం నుండి రాష్ట్ర సమన్వయకర్త వలిగి ప్రభాకర్,ఎర్రగుంట శంకర్ నేతృత్వంలో ప్రజాస్వామిక వాదులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు.ఈ సభను గ్లోబల్ పీస్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ కె.ఎ.పాల్ సమన్వయంతో జరుగుతున్నదని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా యుద్ధాలను ఆపాలని మరియు భారతదేశంలో శాంతి మరియు సమానత్వాన్ని ప్రోత్సహించాలని ప్రపంచాన్ని ఉద్దేశించి ఉపన్యాసాలు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజా సంఘాల నాయకులు బట్టు రామచంద్రయ్య అధ్యక్షత వహించగా ప్రజా సంఘాల నాయకులు బర్రె సుదర్శన్,వడ్డేపల్లి దాసు, కొండమడుగు రాము,ఎస్ శివలింగం,గుండెబోయిన బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News