ఈనెల 22న చెన్నైలో జరిగే ప్రపంచ శాంతి సభను విజయవంతం చేయాలి"
ఈనెల 22న చెన్నైలో జరిగే ప్రపంచ శాంతి సభను విజయవంతం చేయాలి"
Sthanikam District Staff Reporter
ప్రజా సంఘాల సమితి రాష్ట్ర నాయకులు బుగ్గ మైసయ్య
భువనగిరి టౌన్:ప్రపంచంలో ప్రస్తుత పరిస్థితుల్లో శాంతి, స్వేచ్ఛా,సమానత్వం చాలా ప్రధానమైన అవసరమని తెలంగాణ ప్రజా సంఘాల సమితి రాష్ట్ర నాయకులు బుగ్గ మైసయ్య అన్నారు. ప్రపంచ శాంతి కోరుతూ తమిళనాడు రాజధాని కేంద్రమైన చెన్నైలో ఈనెల 22వ తేదీన భారీ సమావేశం జరుగుతున్నదని, ఇట్టి సమావేశానికి ప్రపంచ వ్యాప్తంగా వివిధదేశాల ప్రతినిధులు హాజరు కానున్నారని అన్నారు. దీనికి సంఘీభావంగా తెలంగాణ రాష్ట్రం నుండి రాష్ట్ర సమన్వయకర్త వలిగి ప్రభాకర్,ఎర్రగుంట శంకర్ నేతృత్వంలో ప్రజాస్వామిక వాదులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు.ఈ సభను గ్లోబల్ పీస్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ కె.ఎ.పాల్ సమన్వయంతో జరుగుతున్నదని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా యుద్ధాలను ఆపాలని మరియు భారతదేశంలో శాంతి మరియు సమానత్వాన్ని ప్రోత్సహించాలని ప్రపంచాన్ని ఉద్దేశించి ఉపన్యాసాలు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజా సంఘాల నాయకులు బట్టు రామచంద్రయ్య అధ్యక్షత వహించగా ప్రజా సంఘాల నాయకులు బర్రె సుదర్శన్,వడ్డేపల్లి దాసు, కొండమడుగు రాము,ఎస్ శివలింగం,గుండెబోయిన బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి