Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యా ప్రగతికి నిదర్శనంగా మహిళా డిగ్రీ కళాశాల సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 02:01 AM

ఈనెల 22న చెన్నైలో జరిగే ప్రపంచ శాంతి సభను విజయవంతం చేయాలి"

ఈనెల 22న చెన్నైలో జరిగే ప్రపంచ శాంతి సభను విజయవంతం చేయాలి"

ఈనెల 22న  చెన్నైలో జరిగే ప్రపంచ శాంతి సభను విజయవంతం చేయాలి"
February 20, 2026 09:00 PM 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

ప్రజా సంఘాల సమితి రాష్ట్ర నాయకులు బుగ్గ మైసయ్య

భువనగిరి టౌన్:ప్రపంచంలో ప్రస్తుత పరిస్థితుల్లో శాంతి, స్వేచ్ఛా,సమానత్వం చాలా ప్రధానమైన అవసరమని తెలంగాణ ప్రజా సంఘాల సమితి రాష్ట్ర నాయకులు బుగ్గ మైసయ్య అన్నారు. ప్రపంచ శాంతి కోరుతూ తమిళనాడు రాజధాని కేంద్రమైన చెన్నైలో ఈనెల 22వ తేదీన భారీ సమావేశం జరుగుతున్నదని, ఇట్టి సమావేశానికి ప్రపంచ వ్యాప్తంగా వివిధదేశాల ప్రతినిధులు హాజరు కానున్నారని అన్నారు. దీనికి సంఘీభావంగా తెలంగాణ రాష్ట్రం నుండి రాష్ట్ర సమన్వయకర్త వలిగి ప్రభాకర్,ఎర్రగుంట శంకర్ నేతృత్వంలో ప్రజాస్వామిక వాదులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు.ఈ సభను గ్లోబల్ పీస్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ కె.ఎ.పాల్ సమన్వయంతో జరుగుతున్నదని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా యుద్ధాలను ఆపాలని మరియు భారతదేశంలో శాంతి మరియు సమానత్వాన్ని ప్రోత్సహించాలని ప్రపంచాన్ని ఉద్దేశించి ఉపన్యాసాలు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజా సంఘాల నాయకులు బట్టు రామచంద్రయ్య అధ్యక్షత వహించగా ప్రజా సంఘాల నాయకులు బర్రె సుదర్శన్,వడ్డేపల్లి దాసు, కొండమడుగు రాము,ఎస్ శివలింగం,గుండెబోయిన బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News