Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రామన్నపేటకు మళ్లీ పూర్వ వైభవం… నియోజకవర్గం ఏర్పాటు చేయాలి – పోతరాజు శంకరయ్య “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” జోరుమీద ఆర్‌సీబీ, రాజస్థాన్‌..!! పంజాబ్‌ 'టాప్‌' షో! కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎస్‌కే మల్లికార్జున నియామకం “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 08, 2026 10:56 PM

ఈనెల 19న జరిగే కుల రహిత సమానత్వ సాంస్కృతిక ఉత్సవాలను జయప్రదం చేద్దాం

ఈనెల 19న జరిగే కుల రహిత సమానత్వ సాంస్కృతిక ఉత్సవాలను జయప్రదం చేద్దాం

ఈనెల 19న జరిగే కుల రహిత సమానత్వ సాంస్కృతిక ఉత్సవాలను జయప్రదం చేద్దాం
April 08, 2026 08:23 PM 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 19న సంగారెడ్డి పట్టణంలో నిర్వహించనున్న కుల రహిత సమానత్వ సాంస్కృతిక ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ నారాయణఖేడ్ పట్టణంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భవనం వద్ద కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి పి. అశోక్ మాట్లాడుతూ ఏప్రిల్ నెల మహనీయుల మాసమని, మహాత్మ జ్యోతిబాపూలే కుల వివక్ష, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడి విద్య ద్వారా సమాజ మార్పు కోసం కృషి చేసిన గొప్ప నాయకుడని, అలాగే డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జీవితాంతం కుల అసమానతలకు వ్యతిరేకంగా పోరాడి భారత రాజ్యాంగాన్ని అందించి సమాన హక్కుల కోసం కృషి చేసిన మహనీయుడని తెలిపారు. వారి స్ఫూర్తితో కుల రహిత సమాజ నిర్మాణం కోసం అందరూ కలిసి పని చేయాలని, సమాజంలో ఉన్న కుల వివక్ష, అంటరానితనాన్ని నిర్మూలించేందుకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ ఉత్సవాల్లో మహనీయుల త్యాగాలు, పోరాటాలపై ఉపన్యాసాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని మేధావులు, సామాజిక కార్యకర్తలు, ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు కన్షీరాం, అర్జున్, కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కొటారి నర్సిములు, సహాయ కార్యదర్శి గణపతి, సీఐటీయూ ఏరియా కార్యదర్శి ఎన్. రమేష్, అలాగే సామాజిక ప్రజాసంఘాల నాయకులు రఘు, శీవనంద్, మోహన్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News