ఈనెల 19న జరిగే కుల రహిత సమానత్వ సాంస్కృతిక ఉత్సవాలను జయప్రదం చేద్దాం
ఈనెల 19న జరిగే కుల రహిత సమానత్వ సాంస్కృతిక ఉత్సవాలను జయప్రదం చేద్దాం
Krishna
కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 19న సంగారెడ్డి పట్టణంలో నిర్వహించనున్న కుల రహిత సమానత్వ సాంస్కృతిక ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ నారాయణఖేడ్ పట్టణంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భవనం వద్ద కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి పి. అశోక్ మాట్లాడుతూ ఏప్రిల్ నెల మహనీయుల మాసమని, మహాత్మ జ్యోతిబాపూలే కుల వివక్ష, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడి విద్య ద్వారా సమాజ మార్పు కోసం కృషి చేసిన గొప్ప నాయకుడని, అలాగే డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జీవితాంతం కుల అసమానతలకు వ్యతిరేకంగా పోరాడి భారత రాజ్యాంగాన్ని అందించి సమాన హక్కుల కోసం కృషి చేసిన మహనీయుడని తెలిపారు. వారి స్ఫూర్తితో కుల రహిత సమాజ నిర్మాణం కోసం అందరూ కలిసి పని చేయాలని, సమాజంలో ఉన్న కుల వివక్ష, అంటరానితనాన్ని నిర్మూలించేందుకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ ఉత్సవాల్లో మహనీయుల త్యాగాలు, పోరాటాలపై ఉపన్యాసాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని మేధావులు, సామాజిక కార్యకర్తలు, ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు కన్షీరాం, అర్జున్, కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కొటారి నర్సిములు, సహాయ కార్యదర్శి గణపతి, సీఐటీయూ ఏరియా కార్యదర్శి ఎన్. రమేష్, అలాగే సామాజిక ప్రజాసంఘాల నాయకులు రఘు, శీవనంద్, మోహన్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి