ఎన్టీఆర్ జిల్లాలో మిర్చి తోటలో గంజాయి సాగు బండారం – ఐదుగురు అరెస్ట్
ఎన్టీఆర్ జిల్లాలో మిర్చి తోటలో గంజాయి సాగు బండారం – ఐదుగురు అరెస్ట్
GADDAM JAGANMOHAN REDDY
ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లాలో సంచలనం రేపిన ఘటన వెలుగులోకి వచ్చింది. చందర్లపాడు మండలం పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో మిర్చి తోట మధ్యలో గుట్టుచప్పుడు కాకుండా సాగు చేస్తున్న గంజాయి పంటను పోలీసులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా గుర్తించి ధ్వంసం చేశారు.
ఒక మహిళా రైతు ఆధ్వర్యంలో ఈ అక్రమ సాగు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో అధికారులు మెరుపుదాడి నిర్వహించారు. మిర్చి మొక్కల మధ్య దాచిపెట్టి పెంచిన గంజాయి మొక్కలను పూర్తిగా పీకివేసి, సుమారు 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. అక్రమ మాదకద్రవ్యాల సాగుపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి కార్యకలాపాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
గ్రామంలో ఈ ఘటన కలకలం రేపగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి