Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:32 AM

ఎన్టీఆర్ జిల్లాలో మిర్చి తోటలో గంజాయి సాగు బండారం – ఐదుగురు అరెస్ట్

ఎన్టీఆర్ జిల్లాలో మిర్చి తోటలో గంజాయి సాగు బండారం – ఐదుగురు అరెస్ట్

ఎన్టీఆర్ జిల్లాలో మిర్చి తోటలో గంజాయి సాగు బండారం – ఐదుగురు అరెస్ట్
24-02-2026 70 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లాలో సంచలనం రేపిన ఘటన వెలుగులోకి వచ్చింది. చందర్లపాడు మండలం పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో మిర్చి తోట మధ్యలో గుట్టుచప్పుడు కాకుండా సాగు చేస్తున్న గంజాయి పంటను పోలీసులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా గుర్తించి ధ్వంసం చేశారు.

ఒక మహిళా రైతు ఆధ్వర్యంలో ఈ అక్రమ సాగు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో అధికారులు మెరుపుదాడి నిర్వహించారు. మిర్చి మొక్కల మధ్య దాచిపెట్టి పెంచిన గంజాయి మొక్కలను పూర్తిగా పీకివేసి, సుమారు 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. అక్రమ మాదకద్రవ్యాల సాగుపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి కార్యకలాపాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

గ్రామంలో ఈ ఘటన కలకలం రేపగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Sthanikam

ఎన్టీఆర్ జిల్లాలో మిర్చి తోటలో గంజాయి సాగు బండారం – ఐదుగురు అరెస్ట్

Article Image

ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లాలో సంచలనం రేపిన ఘటన వెలుగులోకి వచ్చింది. చందర్లపాడు మండలం పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో మిర్చి తోట మధ్యలో గుట్టుచప్పుడు కాకుండా సాగు చేస్తున్న గంజాయి పంటను పోలీసులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా గుర్తించి ధ్వంసం చేశారు.

ఒక మహిళా రైతు ఆధ్వర్యంలో ఈ అక్రమ సాగు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో అధికారులు మెరుపుదాడి నిర్వహించారు. మిర్చి మొక్కల మధ్య దాచిపెట్టి పెంచిన గంజాయి మొక్కలను పూర్తిగా పీకివేసి, సుమారు 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. అక్రమ మాదకద్రవ్యాల సాగుపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి కార్యకలాపాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

గ్రామంలో ఈ ఘటన కలకలం రేపగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News