Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణలో ఉద్యోగాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. డివైఎఫ్ఐ. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 12:09 PM

ఎన్నికల సన్నాహాల్లో భువనగిరి సిద్ధం డిస్ట్రిబ్యూషన్–రిసెప్షన్ కేంద్రాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్

ఎన్నికల సన్నాహాల్లో భువనగిరి సిద్ధం డిస్ట్రిబ్యూషన్–రిసెప్షన్ కేంద్రాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్

ఎన్నికల సన్నాహాల్లో భువనగిరి సిద్ధం డిస్ట్రిబ్యూషన్–రిసెప్షన్ కేంద్రాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్
February 09, 2026 07:13 PM 15 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మున్సిపాలిటీ ఎన్నికలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు భువనగిరి మండలం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో దివ్య బాల పాఠశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్ర ఏర్పాట్లను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సోమవారం స్వయంగా పరిశీలించారు.ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు సమగ్రంగా చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్రంలో ఏర్పాటు చేసిన టేబుల్స్, సామగ్రి పంపిణీ విధానం, భద్రతా ఏర్పాట్లు, సీసీ పర్యవేక్షణను ఆయన నిశితంగా పరిశీలించారు.

సిబ్బందికి అవసరమైన త్రాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సరఫరా వంటి మౌలిక వసతులు సమర్థంగా ఉన్నాయా లేదా అన్నదానిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికల ప్రక్రియలో చిన్న పొరపాటుకు కూడా తావులేకుండా ముందస్తు ప్రణాళికతో పని చేయాలని సూచించారు.ఎన్నికల నిర్వహణ విజయవంతానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ప్రజాస్వామ్య పండుగను ప్రశాంతంగా జరిపేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News