Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:11 AM

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న స్థానికేతరులను పంపించేయాలి

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న స్థానికేతరులను పంపించేయాలి

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న స్థానికేతరులను పంపించేయాలి
09-02-2026 218 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

కమిషనర్ కు వినతి పత్రం

కడారి కల్పన ఐలయ్య యాదవ్ బిజెపి పట్టణ అధ్యక్షులు

పట్టణంలోని రెండవ సాధారణ ఎన్నికల సందర్భంగా మున్సిపాలిటీలోని చౌటుప్పల్ లక్కారం, తాళ్లసింగారం, లింగోజిగూడెం,తంగేడిపల్లి గ్రామాలలో పలు పార్టీల ప్రచారంలో భాగంగా వివిధ గ్రామాలనుండి విచ్చేసిన నాయకులను కార్యకర్తలను ఎన్నికల ప్రచార సమయం ముగిసిన వెంటనే తిరిగివారిని సొంత గ్రామాలకు పంపించేలా చర్యలు చేపట్టాలని చౌటుప్పల్ భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షురాలు కడారి కల్పన ఐలయ్య యాదవ్ ఆధ్వర్యంలో చౌటుప్పల్ కమిషనర్ జి వెంక టరామిరెడ్డికి వినతి పత్రం అందజేశారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలో చౌటుప్పల్ తోపాటు తాళ్లసింగారం, తంగడపల్లి లింగోజిగూడెం, లక్కారం గ్రామాలు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 20 వార్డులు ఉండగా ఎన్నికలలో భాగంగా వార్డులకు స్థానికేతరులు వచ్చిఉన్నారు. ఎన్నికల నిబంధన ప్రకారం స్థానికంగా ఓటు హక్కులేని స్థానిక ఇతరులు వార్డులలో ఉండ కూడదు.సోమవారం రోజున సాయంత్రం ఎన్నికల ప్రచార గడువు ముగిసేలోపు స్థానికేతులను ఇక్కడ నుండి పంపించే విధంగా చర్యలు చేపట్టగలరని లేని పక్షంలో స్థానికేతరులు వాటిలలో తిష్ట వేసి ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే అవకాశాలు ఉన్నాయని, ఓటు హక్కు లేని వారిని, స్థానికేతలను గుర్తించి వార్డుల నుండి వారిసొంత ప్రాంతాలకు వెళ్ళే విధంగా చర్యలు చేపట్టగలరు. ఓటు హక్కు లేని వ్యక్తులు పోలింగ్ ఏజెంట్లుగా జరిగే వార్డుల పోలింగ్ స్టేషన్ల పరిధిలో ప్రవేశించకుండా ఆంక్షలు విధించాల్సిందిగా వారు తెలిపారు.

Sthanikam

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న స్థానికేతరులను పంపించేయాలి

Article Image

కమిషనర్ కు వినతి పత్రం

కడారి కల్పన ఐలయ్య యాదవ్ బిజెపి పట్టణ అధ్యక్షులు

పట్టణంలోని రెండవ సాధారణ ఎన్నికల సందర్భంగా మున్సిపాలిటీలోని చౌటుప్పల్ లక్కారం, తాళ్లసింగారం, లింగోజిగూడెం,తంగేడిపల్లి గ్రామాలలో పలు పార్టీల ప్రచారంలో భాగంగా వివిధ గ్రామాలనుండి విచ్చేసిన నాయకులను కార్యకర్తలను ఎన్నికల ప్రచార సమయం ముగిసిన వెంటనే తిరిగివారిని సొంత గ్రామాలకు పంపించేలా చర్యలు చేపట్టాలని చౌటుప్పల్ భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షురాలు కడారి కల్పన ఐలయ్య యాదవ్ ఆధ్వర్యంలో చౌటుప్పల్ కమిషనర్ జి వెంక టరామిరెడ్డికి వినతి పత్రం అందజేశారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలో చౌటుప్పల్ తోపాటు తాళ్లసింగారం, తంగడపల్లి లింగోజిగూడెం, లక్కారం గ్రామాలు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 20 వార్డులు ఉండగా ఎన్నికలలో భాగంగా వార్డులకు స్థానికేతరులు వచ్చిఉన్నారు. ఎన్నికల నిబంధన ప్రకారం స్థానికంగా ఓటు హక్కులేని స్థానిక ఇతరులు వార్డులలో ఉండ కూడదు.సోమవారం రోజున సాయంత్రం ఎన్నికల ప్రచార గడువు ముగిసేలోపు స్థానికేతులను ఇక్కడ నుండి పంపించే విధంగా చర్యలు చేపట్టగలరని లేని పక్షంలో స్థానికేతరులు వాటిలలో తిష్ట వేసి ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే అవకాశాలు ఉన్నాయని, ఓటు హక్కు లేని వారిని, స్థానికేతలను గుర్తించి వార్డుల నుండి వారిసొంత ప్రాంతాలకు వెళ్ళే విధంగా చర్యలు చేపట్టగలరు. ఓటు హక్కు లేని వ్యక్తులు పోలింగ్ ఏజెంట్లుగా జరిగే వార్డుల పోలింగ్ స్టేషన్ల పరిధిలో ప్రవేశించకుండా ఆంక్షలు విధించాల్సిందిగా వారు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News