Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 11:09 PM

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న స్థానికేతరులను పంపించేయాలి

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న స్థానికేతరులను పంపించేయాలి

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న స్థానికేతరులను పంపించేయాలి
February 09, 2026 10:13 AM 214 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

కమిషనర్ కు వినతి పత్రం

కడారి కల్పన ఐలయ్య యాదవ్ బిజెపి పట్టణ అధ్యక్షులు

పట్టణంలోని రెండవ సాధారణ ఎన్నికల సందర్భంగా మున్సిపాలిటీలోని చౌటుప్పల్ లక్కారం, తాళ్లసింగారం, లింగోజిగూడెం,తంగేడిపల్లి గ్రామాలలో పలు పార్టీల ప్రచారంలో భాగంగా వివిధ గ్రామాలనుండి విచ్చేసిన నాయకులను కార్యకర్తలను ఎన్నికల ప్రచార సమయం ముగిసిన వెంటనే తిరిగివారిని సొంత గ్రామాలకు పంపించేలా చర్యలు చేపట్టాలని చౌటుప్పల్ భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షురాలు కడారి కల్పన ఐలయ్య యాదవ్ ఆధ్వర్యంలో చౌటుప్పల్ కమిషనర్ జి వెంక టరామిరెడ్డికి వినతి పత్రం అందజేశారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలో చౌటుప్పల్ తోపాటు తాళ్లసింగారం, తంగడపల్లి లింగోజిగూడెం, లక్కారం గ్రామాలు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 20 వార్డులు ఉండగా ఎన్నికలలో భాగంగా వార్డులకు స్థానికేతరులు వచ్చిఉన్నారు. ఎన్నికల నిబంధన ప్రకారం స్థానికంగా ఓటు హక్కులేని స్థానిక ఇతరులు వార్డులలో ఉండ కూడదు.సోమవారం రోజున సాయంత్రం ఎన్నికల ప్రచార గడువు ముగిసేలోపు స్థానికేతులను ఇక్కడ నుండి పంపించే విధంగా చర్యలు చేపట్టగలరని లేని పక్షంలో స్థానికేతరులు వాటిలలో తిష్ట వేసి ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే అవకాశాలు ఉన్నాయని, ఓటు హక్కు లేని వారిని, స్థానికేతలను గుర్తించి వార్డుల నుండి వారిసొంత ప్రాంతాలకు వెళ్ళే విధంగా చర్యలు చేపట్టగలరు. ఓటు హక్కు లేని వ్యక్తులు పోలింగ్ ఏజెంట్లుగా జరిగే వార్డుల పోలింగ్ స్టేషన్ల పరిధిలో ప్రవేశించకుండా ఆంక్షలు విధించాల్సిందిగా వారు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News