Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:55 PM

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న స్థానికేతరులను పంపించేయాలి

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న స్థానికేతరులను పంపించేయాలి

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న స్థానికేతరులను పంపించేయాలి
February 09, 2026 10:13 AM 208 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

కమిషనర్ కు వినతి పత్రం

కడారి కల్పన ఐలయ్య యాదవ్ బిజెపి పట్టణ అధ్యక్షులు

పట్టణంలోని రెండవ సాధారణ ఎన్నికల సందర్భంగా మున్సిపాలిటీలోని చౌటుప్పల్ లక్కారం, తాళ్లసింగారం, లింగోజిగూడెం,తంగేడిపల్లి గ్రామాలలో పలు పార్టీల ప్రచారంలో భాగంగా వివిధ గ్రామాలనుండి విచ్చేసిన నాయకులను కార్యకర్తలను ఎన్నికల ప్రచార సమయం ముగిసిన వెంటనే తిరిగివారిని సొంత గ్రామాలకు పంపించేలా చర్యలు చేపట్టాలని చౌటుప్పల్ భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షురాలు కడారి కల్పన ఐలయ్య యాదవ్ ఆధ్వర్యంలో చౌటుప్పల్ కమిషనర్ జి వెంక టరామిరెడ్డికి వినతి పత్రం అందజేశారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలో చౌటుప్పల్ తోపాటు తాళ్లసింగారం, తంగడపల్లి లింగోజిగూడెం, లక్కారం గ్రామాలు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 20 వార్డులు ఉండగా ఎన్నికలలో భాగంగా వార్డులకు స్థానికేతరులు వచ్చిఉన్నారు. ఎన్నికల నిబంధన ప్రకారం స్థానికంగా ఓటు హక్కులేని స్థానిక ఇతరులు వార్డులలో ఉండ కూడదు.సోమవారం రోజున సాయంత్రం ఎన్నికల ప్రచార గడువు ముగిసేలోపు స్థానికేతులను ఇక్కడ నుండి పంపించే విధంగా చర్యలు చేపట్టగలరని లేని పక్షంలో స్థానికేతరులు వాటిలలో తిష్ట వేసి ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే అవకాశాలు ఉన్నాయని, ఓటు హక్కు లేని వారిని, స్థానికేతలను గుర్తించి వార్డుల నుండి వారిసొంత ప్రాంతాలకు వెళ్ళే విధంగా చర్యలు చేపట్టగలరు. ఓటు హక్కు లేని వ్యక్తులు పోలింగ్ ఏజెంట్లుగా జరిగే వార్డుల పోలింగ్ స్టేషన్ల పరిధిలో ప్రవేశించకుండా ఆంక్షలు విధించాల్సిందిగా వారు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News