Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:05 AM

ఎన్నికల నియమావళి పై అవగాహన కార్యక్రమం

ఎన్నికల నియమావళి పై అవగాహన కార్యక్రమం

ఎన్నికల నియమావళి పై అవగాహన కార్యక్రమం
February 07, 2026 10:21 PM 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

ఎన్నికల నియమావళి పై అవగాహన కార్యక్రమం

సూర్యాపేట ఎస్పీ కే నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు, కోదాడ డి.ఎస్.పి శ్రీనివాస రెడ్డి,కోదాడ రూరల్ ఎస్సై గోపాల్ రెడ్డి

మున్సిపల్ ఎన్నికల నియమాలు అమలులో భాగంగా కోదాడ రూరల్ మండల పరిధిలోని కొమరబండ గ్రామంలో పోలీసు, జిల్లా పోలీసు కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన, పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎన్నికల నియమావళి ఎన్నికల ప్రాముఖ్యతను గురించి ప్రజలకు అర్థమయ్యేలా పోలీసు కళాబృందం కళాకారులు ఆటపాట సాంస్కృతిక కార్యక్రమాలతో చైతన్యపరిచారు.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కోదాడ రూరల్ SI గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ..

ప్రజలు ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళికి లోబడి నడుచుకోవాలని, ఎన్నికల సమయంలో తగాదాలు పెట్టుకుంటే భవిష్యత్తులో సమస్యలు వస్తాయని వారికి వివరించారు. గ్రామాలు ఎన్నికల విషయంలో మంచి చరిత్రను కలిగి ఉండాలని సూచించారు. ప్రలోభాలకు గురి కావొద్దు అన్నారు. సోషల్ మీడియాలో ఇతర వ్యక్తుల పట్ల అనుచిత వ్యాఖ్యలు గానీ అనుచిత పోస్టులు గాని చేయవద్దని కోరారు.ఎన్నికల సమయంలో గ్రామంలో శాంతిభద్రతులకు విగాథం కలిగించకుండా ఎన్నికల నియమావళికి లోబడి ప్రశాంతంగా ఎన్నికలు జరుపుకోవాలని తెలియజేశారు. గ్రామంలో ప్రశాంత వాతావరణం కలిగి ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ASI రమేష్, రెవిన్యూ ఇన్స్పెక్టర్ రాజేష్, గ్రామ పోలీస్ అధికారి సుధీర్ కుమార్, పోలీస్ సిబ్బంది కానిస్టేబుల్ శ్రీనివాసరావు, సురేష్,శ్రీకాంత్, మహిళా పోలీస్ సిబ్బంది, పద్మ, సుధా, మరియుపోలీస్ కళాబృందం ఇంచార్జి యల్లయ్య, సభ్యులు గోపయ్య, చారి, కృష్ణ, గురులింగం, సత్యం గ్రామ ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News