Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 01:41 PM

ఎన్నికల నియమావళి పై అవగాహన కార్యక్రమం

ఎన్నికల నియమావళి పై అవగాహన కార్యక్రమం

ఎన్నికల నియమావళి పై అవగాహన కార్యక్రమం
February 07, 2026 10:21 PM 5 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish HS

ఎన్నికల నియమావళి పై అవగాహన కార్యక్రమం

సూర్యాపేట ఎస్పీ కే నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు, కోదాడ డి.ఎస్.పి శ్రీనివాస రెడ్డి,కోదాడ రూరల్ ఎస్సై గోపాల్ రెడ్డి

మున్సిపల్ ఎన్నికల నియమాలు అమలులో భాగంగా కోదాడ రూరల్ మండల పరిధిలోని కొమరబండ గ్రామంలో పోలీసు, జిల్లా పోలీసు కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన, పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎన్నికల నియమావళి ఎన్నికల ప్రాముఖ్యతను గురించి ప్రజలకు అర్థమయ్యేలా పోలీసు కళాబృందం కళాకారులు ఆటపాట సాంస్కృతిక కార్యక్రమాలతో చైతన్యపరిచారు.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కోదాడ రూరల్ SI గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ..

ప్రజలు ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళికి లోబడి నడుచుకోవాలని, ఎన్నికల సమయంలో తగాదాలు పెట్టుకుంటే భవిష్యత్తులో సమస్యలు వస్తాయని వారికి వివరించారు. గ్రామాలు ఎన్నికల విషయంలో మంచి చరిత్రను కలిగి ఉండాలని సూచించారు. ప్రలోభాలకు గురి కావొద్దు అన్నారు. సోషల్ మీడియాలో ఇతర వ్యక్తుల పట్ల అనుచిత వ్యాఖ్యలు గానీ అనుచిత పోస్టులు గాని చేయవద్దని కోరారు.ఎన్నికల సమయంలో గ్రామంలో శాంతిభద్రతులకు విగాథం కలిగించకుండా ఎన్నికల నియమావళికి లోబడి ప్రశాంతంగా ఎన్నికలు జరుపుకోవాలని తెలియజేశారు. గ్రామంలో ప్రశాంత వాతావరణం కలిగి ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ASI రమేష్, రెవిన్యూ ఇన్స్పెక్టర్ రాజేష్, గ్రామ పోలీస్ అధికారి సుధీర్ కుమార్, పోలీస్ సిబ్బంది కానిస్టేబుల్ శ్రీనివాసరావు, సురేష్,శ్రీకాంత్, మహిళా పోలీస్ సిబ్బంది, పద్మ, సుధా, మరియుపోలీస్ కళాబృందం ఇంచార్జి యల్లయ్య, సభ్యులు గోపయ్య, చారి, కృష్ణ, గురులింగం, సత్యం గ్రామ ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News