Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 04:39 AM

ఎన్నికల నిర్వహణలో ఏమాత్రం లోటుపాట్లు వద్దు పోలింగ్–కౌంటింగ్ పారదర్శకంగా జరగాలి : జిల్లా కలెక్టర్ హనుమంతరావు

ఎన్నికల నిర్వహణలో ఏమాత్రం లోటుపాట్లు వద్దు పోలింగ్–కౌంటింగ్ పారదర్శకంగా జరగాలి : జిల్లా కలెక్టర్ హనుమంతరావు

ఎన్నికల నిర్వహణలో ఏమాత్రం లోటుపాట్లు వద్దు పోలింగ్–కౌంటింగ్ పారదర్శకంగా జరగాలి : జిల్లా కలెక్టర్ హనుమంతరావు
February 09, 2026 04:45 PM 23 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్, ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, శాంతియుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అధికారులకు ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావుతో కలిసి జిల్లాలోని అన్ని మున్సిపల్ కమిషనర్లు, ఎన్నికల అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలో ఎటువంటి లోటుపాట్లు తలెత్తకుండా ప్రతి అంశాన్ని ముందుగానే పరిశీలించాలని సూచించారు.పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్ సదుపాయం, ర్యాంపులు, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులు తప్పనిసరిగా కల్పించాలని తెలిపారు. వృద్ధులు, వికలాంగులు, గర్భిణీలు వంటి ప్రత్యేక వర్గాల ఓటర్లకు అవసరమైన ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎన్నికల నియమ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలన్నారు.ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో టేబుళ్ల ఏర్పాటు, సిబ్బంది నియామకం, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. లెక్కింపు కేంద్రాల్లో తాగునీటి సదుపాయం, సీసీ కెమెరాలు, బ్యారికేడ్లు ఏర్పాటు చేసి భద్రతను మరింత పటిష్టం చేయాలని తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా సాగాలన్నారు.అధికారులంతా బాధ్యతాయుతంగా పనిచేసి ఎన్నికలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో ఆర్డీవోలు కృష్ణారెడ్డి, శేఖర్‌రెడ్డి, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి నాగిరెడ్డి, అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేష్, తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News