Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణలో ఉద్యోగాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. డివైఎఫ్ఐ. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 12:09 PM

ఎన్నికల నిర్వహణలో ఏమాత్రం లోటుపాట్లు వద్దు పోలింగ్–కౌంటింగ్ పారదర్శకంగా జరగాలి : జిల్లా కలెక్టర్ హనుమంతరావు

ఎన్నికల నిర్వహణలో ఏమాత్రం లోటుపాట్లు వద్దు పోలింగ్–కౌంటింగ్ పారదర్శకంగా జరగాలి : జిల్లా కలెక్టర్ హనుమంతరావు

ఎన్నికల నిర్వహణలో ఏమాత్రం లోటుపాట్లు వద్దు పోలింగ్–కౌంటింగ్ పారదర్శకంగా జరగాలి : జిల్లా కలెక్టర్ హనుమంతరావు
February 09, 2026 04:45 PM 22 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్, ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, శాంతియుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అధికారులకు ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావుతో కలిసి జిల్లాలోని అన్ని మున్సిపల్ కమిషనర్లు, ఎన్నికల అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలో ఎటువంటి లోటుపాట్లు తలెత్తకుండా ప్రతి అంశాన్ని ముందుగానే పరిశీలించాలని సూచించారు.పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్ సదుపాయం, ర్యాంపులు, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులు తప్పనిసరిగా కల్పించాలని తెలిపారు. వృద్ధులు, వికలాంగులు, గర్భిణీలు వంటి ప్రత్యేక వర్గాల ఓటర్లకు అవసరమైన ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎన్నికల నియమ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలన్నారు.ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో టేబుళ్ల ఏర్పాటు, సిబ్బంది నియామకం, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. లెక్కింపు కేంద్రాల్లో తాగునీటి సదుపాయం, సీసీ కెమెరాలు, బ్యారికేడ్లు ఏర్పాటు చేసి భద్రతను మరింత పటిష్టం చేయాలని తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా సాగాలన్నారు.అధికారులంతా బాధ్యతాయుతంగా పనిచేసి ఎన్నికలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో ఆర్డీవోలు కృష్ణారెడ్డి, శేఖర్‌రెడ్డి, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి నాగిరెడ్డి, అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేష్, తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News