PRINT TIME: April 11, 2026 03:20 PM
ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
January 28, 2026 08:49 AM
50 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Biksham
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రజలు, వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నగదు లావాదేవీల్లో యాభై వేల రూపాయలకు మించి నగదు తీసుకువెళ్లవద్దని తెలిపారు.అత్యధిక నగదు లావాదేవీలకు సంబంధించి సరైన ఆధార పత్రాలు తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అలాగే బంగారు నగలు, ఇతర ఖరీదైన వస్తువులు తీసుకువెళ్లే సమయంలో సంబంధిత బిల్లులు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు.ఎన్నికల సమయంలో తనిఖీలు కఠినంగా కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ప్రజలు సహకరించి ప్రశాంత ఎన్నికల నిర్వహణకు తోడ్పడాలని కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి