Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా పూలే జయంతి – సమానత్వం కోసం కృషి చేయాలి కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 04:22 PM

ఎన్నికల బందోబస్తులో అప్రమత్తత, క్రమశిక్షణ తప్పనిసరి

ఎన్నికల బందోబస్తులో అప్రమత్తత, క్రమశిక్షణ తప్పనిసరి

ఎన్నికల బందోబస్తులో అప్రమత్తత, క్రమశిక్షణ తప్పనిసరి
February 10, 2026 06:38 PM 50 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఫిబ్రవరి 11న జిల్లాలో జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా పోలీసు సిబ్బంది అత్యంత అప్రమత్తంగా, క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని జిల్లా పోలీసు అధికారి నరసింహ సూచించారు. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల బందోబస్తు విధులు నిర్వహించనున్న సిబ్బందికి పట్టణంలోని త్రివేణి ఫంక్షన్ హాలులో ఆయన మార్గనిర్దేశం చేశారు.ఎన్నికల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు సిబ్బంది పాత్ర అత్యంత కీలకమని తెలిపారు. బందోబస్తు విధుల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా పూర్తి అంకితభావంతో బాధ్యతలు నిర్వహించాలని ఆదేశించారు. విధులు పూర్తయ్యే వరకు కేటాయించిన ప్రాంతాలను వదలకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను క్రమబద్ధంగా నిలబెట్టాలని, అనుమతిలేని వ్యక్తులను కేంద్రాల పరిసరాల్లోకి రానివ్వకూడదని స్పష్టం చేశారు. వంద మీటర్ల పరిధిలో ఆంక్షలను కఠినంగా అమలు చేయాలని, ఓటర్లు సెల్ ఫోన్లు లేదా ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకువస్తున్నారా అనే విషయంపై నిఘా ఉంచాలని సూచించారు.

ఎన్నికల సామగ్రి తరలింపులో రూట్ మొబైల్ పోలీసు సిబ్బంది విధులు అత్యంత కీలకమని పేర్కొన్నారు. పోలింగ్ సామగ్రిని పోలింగ్ బూత్‌లకు చేర్చడం, స్ట్రాంగ్ రూములకు తరలించడంలో పూర్తి భద్రత కల్పిస్తూ అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు, గొడవలు, గుంపులుగా చేరడం వంటి పరిస్థితులు ఎదురైతే వెంటనే స్ట్రైకింగ్ ఫోర్స్, రూట్ మొబైల్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని తెలిపారు.ప్రతి అధికారి, సిబ్బంది ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా పాటిస్తూ, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విధుల నిర్వహణలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకోవద్దని స్పష్టం చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో అదనపు ఎస్పీ జనార్దన్ రెడ్డి, సూర్యాపేట డివిజన్ డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐలు వెంకటయ్య, రాజశేఖర్, రామారావు, శివకుమార్, ప్రవీణ్ కుమార్, ఎస్సైలు, ఏఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News