Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణలో ఉద్యోగాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. డివైఎఫ్ఐ. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 12:04 PM

ఎన్నడూ కనివిని ఎరుగని రీతిలో బ్రహ్మోత్సవాల పనులు ప్రారంభం

ఎన్నడూ కనివిని ఎరుగని రీతిలో బ్రహ్మోత్సవాల పనులు ప్రారంభం

ఎన్నడూ కనివిని ఎరుగని రీతిలో బ్రహ్మోత్సవాల పనులు ప్రారంభం
February 13, 2026 04:22 PM 515 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నిదానపల్లి గ్రామానికి నలుదిక్కుల రహదారులు – జేసీబీలతో చెట్ల తొలగింపు

రామన్నపేట, నిదానపల్లి:

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల పరిధిలోని నిదానపల్లి గ్రామంలో మల్లన్న గుట్టపై కొలువై ఉన్న శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయం (చిన్న శ్రీశైలం) బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు ఈసారి ఎన్నడూ లేనివిధంగా ఊపందుకున్నాయి.

భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదన్న ఉద్దేశంతో గ్రామానికి నలుదిక్కుల నుంచి రహదారుల విస్తరణ పనులు చేపట్టారు. నిర్ణముల, బోగారం, ఇంద్రపాలనగరం వైపుల నుంచి వచ్చే మార్గాలను జేసీబీల సహాయంతో శుభ్రపరచి, రహదారుల ఇరువైపుల పెరిగిన చెట్లను తొలగించారు. గతంలో ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ పనులు బ్రహ్మోత్సవాల సందర్భంగా వేగవంతం కావడం విశేషం.

గ్రామస్థుల సహకారంతో ఉత్సవ కమిటీ చైర్మన్ చల్ల నరసింహ ఆధ్వర్యంలో పనులు పర్యవేక్షిస్తున్నారు.డైరెక్టర్ కడారి మల్లేశం, అంగడయ్య, గ్రామ పెద్దలు నారపాక యాదయ్య, కొండ మల్లయ్య, కొండ శంకరయ్య, వర్కాల స్వామి, గ్రామపంచాయతీ సిబ్బంది వీరమల్ల వీరేశం తదితరులు కార్యక్రమంలో పాల్గొని ఏర్పాట్లను పరిశీలించారు.

ఈసారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు గ్రామంలో విద్యుత్, తాగునీరు, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులకు సౌకర్యవంతమైన రాకపోకలు కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ రహదారి పనులు గ్రామ ప్రజల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి.

మీ స్పందన? 8 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News