Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
லஞ்ச் பாக்ஸுடன் செயலகத்திற்கு முதல்வர் விஜய்.. சாதாரண ஊழியரைப் போல புதிய பணிமுறை లంచ్ బాక్స్‌తో సచివాలయానికి సీఎం విజయ్.. సాధారణ ఉద్యోగిలా కొత్త పని శైలి ఆర్. డి. టీ సంస్థ కి సహాయం చేయడం నా అదృష్టం :- లోకేష్ సీఎం పర్యటనపై భద్రత ఏర్పాట్లు పరిశీలిస్తున్న సత్యసాయి జిల్లా అధికారులు వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 16, 2026 03:56 PM

ఎన్‌జి కళాశాలలో AIపై అవగాహన.విద్యార్థులకు ఆధునిక సాంకేతికతలపై దిశానిర్దేశం

ఎన్‌జి కళాశాలలో AIపై అవగాహన.విద్యార్థులకు ఆధునిక సాంకేతికతలపై దిశానిర్దేశం

ఎన్‌జి కళాశాలలో AIపై అవగాహన.విద్యార్థులకు ఆధునిక సాంకేతికతలపై దిశానిర్దేశం
May 16, 2026 02:35 PM 49 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హయత్‌నగర్, : తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న “ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా నాగార్జున ప్రభుత్వ కళాశాలలో శనివారం కృత్రిమ మేధస్సు (AI)పై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రస్తుత సమాజంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆధునిక సాంకేతికతలపై విద్యార్థులు, అధ్యాపకులకు అవగాహన కల్పించడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ తెలిపారు.

సదస్సులో ప్రముఖ లీగల్ ప్రాక్టీషనర్ సిద్దేశ్వర్ రావు, కంప్యూటర్ సైన్స్ అధ్యాపకులు ఎస్.పీ. వెంకటరమణ, టీఎస్‌కేసీ మెంటార్ ఎం.డి. తౌసిఫ్, ఆంగ్ల విభాగాధిపతి డా. వైవీఆర్ ప్రసన్నకుమార్ రిసోర్స్ పర్సన్లుగా పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML) ప్రస్తుత జీవన విధానంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. భవిష్యత్తులో డేటా సైన్స్‌కు మరింత ప్రాధాన్యం పెరుగుతుందని పేర్కొన్నారు.

హెల్త్‌కేర్‌లో వ్యాధుల గుర్తింపు, వ్యవసాయంలో దిగుబడుల పెంపులో AI సాంకేతికత వినియోగంపై నమూనాలను ప్రదర్శించారు. బోధన, అభ్యసన ప్రక్రియలను సులభతరం చేసే ఆధునిక AI టూల్స్‌పై ప్రత్యేకంగా వివరించారు.

ఈ ప్రదర్శనను విద్యార్థులు, అధ్యాపకులు ఆసక్తిగా సందర్శించి ఆధునిక సాంకేతిక ఆవిష్కరణలను తిలకించారు.

కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ అంతటి శ్రీనివాసులు, పరీక్షల నియంత్రణాధికారి డా. డి. మునిస్వామి, అధ్యాపకులు జె. నాగరాజు, డా. వెల్దండి శ్రీధర్, కోటయ్య, డా. ఎ. మల్లేశం, లెఫ్టినెంట్ సుధాకర్, డా. అనిల్ బొజ్జ, డా. జ్యోత్స్న, డా. ఎం. శ్రీనివాస్ రెడ్డి తదితరులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News