Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:32 PM

ఎన్‌జీ కళాశాలలో ముగిసిన విద్యా వారోత్సవాలు

ఎన్‌జీ కళాశాలలో ముగిసిన విద్యా వారోత్సవాలు

ఎన్‌జీ కళాశాలలో ముగిసిన విద్యా వారోత్సవాలు
May 17, 2026 03:04 PM 27 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నాగార్జున ప్రభుత్వ కళాశాలలో గత వారం రోజులుగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “విద్యా వారోత్సవాలు–2026” ఆదివారం ఘనంగా ముగిశాయి. ముగింపు కార్యక్రమంలో భాగంగా క్రీడాకారులకు సన్మానం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థి క్రీడాకారులను కళాశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది. కళాశాలకు గుర్తింపు తీసుకొచ్చిన విద్యార్థులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా పతకాలు, ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలను అందజేశారు.

ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంప్రదాయ, జానపద నృత్యాలు, దేశభక్తి గీతాలు సభలో ఆకట్టుకున్నాయి. వారం రోజులుగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.

కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాల్లో ప్రతిభ కనబరిచి కళాశాలకు పేరు తీసుకురావడం అభినందనీయమన్నారు. వైస్ ప్రిన్సిపాల్ ‘ఎడ్యుకేషన్ వీక్’ ద్వారా సాధించిన ఫలితాలను వివరించగా, డిప్యూటీ కోఆర్డినేటర్ బత్తిని నాగరాజు వారం రోజుల కార్యక్రమాల సమగ్ర నివేదికను సమర్పించారు.

ఈ కార్యక్రమంలో పరీక్షల నియంత్రణాధికారి డా. డి. మునిస్వామి, అధ్యాపకులు డా. వెల్దండి శ్రీధర్, డా. ఆదె మల్లేశం, డా. అనిల్ బొజ్జ, ఎన్. కోటయ్య, శిరీష, వెంకటేశం, భాస్కర్ తదితరులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News