ఎన్జీ కళాశాలలో ముగిసిన విద్యా వారోత్సవాలు
ఎన్జీ కళాశాలలో ముగిసిన విద్యా వారోత్సవాలు
Editor Desk
నాగార్జున ప్రభుత్వ కళాశాలలో గత వారం రోజులుగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “విద్యా వారోత్సవాలు–2026” ఆదివారం ఘనంగా ముగిశాయి. ముగింపు కార్యక్రమంలో భాగంగా క్రీడాకారులకు సన్మానం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థి క్రీడాకారులను కళాశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది. కళాశాలకు గుర్తింపు తీసుకొచ్చిన విద్యార్థులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా పతకాలు, ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలను అందజేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంప్రదాయ, జానపద నృత్యాలు, దేశభక్తి గీతాలు సభలో ఆకట్టుకున్నాయి. వారం రోజులుగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.
కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాల్లో ప్రతిభ కనబరిచి కళాశాలకు పేరు తీసుకురావడం అభినందనీయమన్నారు. వైస్ ప్రిన్సిపాల్ ‘ఎడ్యుకేషన్ వీక్’ ద్వారా సాధించిన ఫలితాలను వివరించగా, డిప్యూటీ కోఆర్డినేటర్ బత్తిని నాగరాజు వారం రోజుల కార్యక్రమాల సమగ్ర నివేదికను సమర్పించారు.
ఈ కార్యక్రమంలో పరీక్షల నియంత్రణాధికారి డా. డి. మునిస్వామి, అధ్యాపకులు డా. వెల్దండి శ్రీధర్, డా. ఆదె మల్లేశం, డా. అనిల్ బొజ్జ, ఎన్. కోటయ్య, శిరీష, వెంకటేశం, భాస్కర్ తదితరులు, విద్యార్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి