ఎన్జీ కళాశాలలో మెగా మెడికల్ క్యాంప్ ఘనంగా పేరెంట్స్ మీట్, పూర్వ విద్యార్థుల సమ్మేళనం
ఎన్జీ కళాశాలలో మెగా మెడికల్ క్యాంప్ ఘనంగా పేరెంట్స్ మీట్, పూర్వ విద్యార్థుల సమ్మేళనం
Editor Desk
నాగార్జున ప్రభుత్వ కళాశాలలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాల్లో గురువారం ఉచిత వైద్య శిబిరం, తల్లిదండ్రుల–అధ్యాపకుల సమావేశం, ప్రయోగశాలల సందర్శన, పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు.
విద్యార్థులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో డా. జయంత్, డా. శివాజి, డా. ఇమ్రాన్, డా. నౌషిన్ బృందం మధుమేహం, రక్తపోటు తదితర పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఆరోగ్య జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో కళాశాలలో చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు. కళాశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.
అనంతరం తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులకు కళాశాలలోని సైన్స్, కంప్యూటర్ ప్రయోగశాలలను సందర్శించే అవకాశం కల్పించారు. కళాశాలలోని ఆధునిక వసతులు చూసి వారు హర్షం వ్యక్తం చేశారు.
తల్లిదండ్రుల–అధ్యాపకుల సమావేశంలో విద్యార్థుల హాజరు, క్రమశిక్షణ, పరీక్షల ఫలితాలపై అధ్యాపకులు తల్లిదండ్రులకు వివరించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని తెలిపారు.
కార్యక్రమంలో సమన్వయకర్త డా. పరంగి రవికుమార్, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ అంతటి శ్రీనివాసులు, అకాడమిక్ కోఆర్డినేటర్ బత్తిని నాగరాజు, డా. డి. మునిస్వామి, డా. ఆదె మల్లేశం, డా. వెల్దండి శ్రీధర్, డా. భట్టు కిరీటం, డా. అనిల్ బొజ్జ, డా. ఎం. శ్రీనివాసరెడ్డి, లెఫ్టినెంట్ సుధాకర్, ఎన్. కోటయ్య, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి