Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 06:23 AM

ఎన్జీ కళాశాలలో ఘనంగా రెడ్ రిబ్బన్ క్లబ్ పీర్ లీడర్స్ కన్వెన్షన్

ఎన్జీ కళాశాలలో ఘనంగా రెడ్ రిబ్బన్ క్లబ్ పీర్ లీడర్స్ కన్వెన్షన్

ఎన్జీ కళాశాలలో ఘనంగా రెడ్ రిబ్బన్ క్లబ్ పీర్ లీడర్స్ కన్వెన్షన్
December 30, 2025 04:43 PM 58 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎన్జీ కళాశాలలో రెడ్ రిబ్బన్ క్లబ్ పీర్ లీడర్స్ కన్వెన్షన్

నల్లగొండ స్థానికం ప్రతినిధి

నాగార్జున ప్రభుత్వ కళాశాల (స్వయం ప్రతిపత్తి)లో హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన కల్పించే ఉద్దేశంతో వన్ డే రెడ్ రిబ్బన్ క్లబ్ పీర్ లీడర్స్ కన్వెన్షన్ కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీ, రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ అధ్యక్షత వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా పాల్గొన్న నేషనల్ యూత్ అవార్డు గ్రహీత డా. ఆకుల మధు, హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన, యువత పాత్ర, ఆరోగ్య పరిరక్షణ అంశాలపై వివరించారు. యువత చైతన్యంతో ముందుకు వస్తేనే హెచ్‌ఐవీ నివారణ సాధ్యమని అన్నారు.

యన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డా. వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ, యువత ఆరోగ్య పరిరక్షణలో హెచ్‌ఐవీ నివారణనే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని అవగాహనతో ముందుకు సాగాలని సూచించారు. మరో రిసోర్స్ పర్సన్ భవాని మాట్లాడుతూ, హెచ్‌ఐవీ బాధితులకు సమాజం ఆసరాగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డా. పరంగి రవికుమార్, రిసోర్స్ పర్సన్ లింగస్వామి, రెడ్ రిబ్బన్ క్లబ్ కన్వీనర్ డా. గంజి భాగ్యలక్ష్మి, యన్‌ఎస్‌ఎస్ యూనిట్ల ప్రోగ్రామ్ ఆఫీసర్లు ఎన్. కోటయ్య, ఎం. వెంకట్‌రెడ్డి, డా. అదే మల్లేశం, కంబాలపల్లి శివరాణి, మంద సావిత్రి, చైతన్య సుధ, పుష్పలతలతో పాటు బోధన, బోధనేతర సిబ్బంది మరియు వివిధ కళాశాలల యన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News