ఎమ్మెల్యే స్వగృహంలో ఘనంగా జంగమ సమాజ్ క్యాలెండర్ ఆవిష్కరణ
ఎమ్మెల్యే స్వగృహంలో ఘనంగా జంగమ సమాజ్ క్యాలెండర్ ఆవిష్కరణ
Krishna
నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ
వీరశైవ జంగమ సమాజం ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలో ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమం స్థానిక శాసనసభ్యులు డాక్టర్ పి సంజీవరెడ్డి స్వగృహంలో నిర్వహించబడింది. ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, క్యాలెండర్ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా పి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, వీరశైవ జంగమ సమాజం సేవాభావంతో సమాజాభివృద్ధికి చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆనంద్ స్వామి, మన్మధ కిషోర్, నరేష్ స్వామి, రేవనాయ స్వామి, శ్రీశైలం, నాగయ్య స్వామి, సిద్ధు స్వామి తదితర స్వాములు మరియు సమాజ పెద్దలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి