ఎమ్మెల్యే సామేలను కలిసిన అరుంధతి యువజన సంఘం
ఎమ్మెల్యే సామేలను కలిసిన అరుంధతి యువజన సంఘం
Bandi Kiran Kumar
తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మందుల సామేల్ ను శనివారం హైదరాబాద్ తన నివాసంలో గొట్టిపర్తి అరుంధతి యువజన సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను యువజన సంఘం నాయకులు శాలువాతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా గొట్టిపర్తిలోఅరుంధతి యువజన సంఘం అధ్వర్యంలో నిర్వహిస్తున్న మహాత్మ జ్యోతిరావు ఫూలే విగ్రహా ప్రతిష్ఠాపన, సాంస్కృతిక కబడ్డి క్రీడోత్సవాలకు ముఖ్య అతిథులుగా రావాలని ఎమ్మెల్యే మందుల సామేలు ఆహ్వానించడం జరిగింది. మహాత్మగాంధీ జ్యోతిరావు పూలే విగ్రహా ప్రతిష్ట చేయడం సంతోషకరమని, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అరుంధతి యువజన సంఘ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు.ఈ కార్యక్రమంలో విగ్రహా కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ పాశం అవిలయ్య, అరుంధతి అధ్యక్షులు పరమేష్ ఉపాధ్యక్షులు మందుల కృష్ణ విగ్రహా ప్రతిష్ఠ కమిటీ అధ్యక్షులు విఠల్ ఉపాధ్యక్షులు మందుల నరేష్ ,చింతకుంట్ల సైదులు,కోశాధికారులు గాడిపల్లి శ్రీను,చింతకుంట్ల యాకయ్య అందె సతీష్,జలగం పరషరాములు,మాచర్ల నవీన్,శ్రవణ్ స్టార్,మాచర్ల మహేష్,చింతకుంట్ల యల్లేష్,పాలడుగు రమేష్,పాల్వాయి శ్రీను,మరియు రజక సంఘం సభ్యులు పిచ్చయ్య,మడిపెద్ది రాము,మహేష్ ,గౌడ సంఘం సభ్యులు ముత్యం జితేందర్లు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి