ఎమ్మెల్యే సహాకారంతో కొత్త విద్యుత్ స్తంభాల ఏర్పాటు
ఎమ్మెల్యే సహాకారంతో కొత్త విద్యుత్ స్తంభాల ఏర్పాటు
Sthanikam District Staff Reporter
విద్యుత్ స్తంభాల ఏర్పాటును పరిశీలిస్తున్న మార్కేట్ కమిటీ చైర్మన్ రేఖ బాబురావు
భువనగిరి:మండల పరిధిలోని బోల్లేపల్లి గ్రామంలో భువనగిరి ఎమ్మెల్యే సహాకారంతో మార్కెట్ కమిటీ చైర్మన్ కనుకుంట్ల రేఖా బాబురావు నూతన కొత్త విద్యుత్ స్తంభాల కోసం మంజూరు చేసిన రూ 50 లక్షల రూపాయలతో నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు.కరెంటు స్తంభాలు లేక విద్యుత్ కనెక్షన్ లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమస్యల్ని మార్కెట్ కమిటీ చైర్మన్ కనుకుంట్ల రేఖా బాబురావు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకొని వెళ్లి తెలుపగా వారు తక్షణమే స్పందించి నిధులు మంజూరు చేయించి భువనగిరి జిల్లా అధికారి SE కి ఆదేశించగా వారు వెంటనే విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయడం పట్ల బొల్లెపల్లి గ్రామస్తులు మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖ బాబురావు,ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జిట్టా కృష్ణరెడ్డి,మద్ది ముత్యంరెడ్డి,మండల యూత్ కాంగ్రెస్ నాయకులు కనకుంట్ల కొండల్,బాలస్వామి,బాలకృష్ణ,నల్లగొండ ప్రభాకర్,k.శ్రీను,T.శ్రీను,నర్సింహా,యాదయ్య,బుచ్చయ్య,బాలయ్య,వేంకటేష్,విద్యుత్ అధికారులు, బింగి లక్ష్మణ్,రమేష్,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి