ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మద్దతుతో భూషపాక అండాలు ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా ప్రారంభం
ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మద్దతుతో భూషపాక అండాలు ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా ప్రారంభం
Sthanikam District Staff Reporter
ప్రజలే నా బలం, గెలుపే లక్ష్యంగా 32వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి భూషపాక అండాలు ప్రసంగం
భువనగిరి మున్సిపాలిటీ ఎన్నికల్లో 32వ వార్డుకు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా భూషపాక అండాలుకు భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి టికెట్ కేటాయించారు. ఈ సందర్భంగా భువనగిరి పట్టణంలోని స్థానిక తారక రామానగర్,32వ వార్డులో భూషపాక కొండల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,వార్డు ప్రజలతో కలిసి సుమారు రెండు వందల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం స్థానిక కమ్యూనిటీ హాల్ సమీపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి భూషపాక అండాలు మాట్లాడారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తనపై ఉంచిన నమ్మకంతోనే ఈ అవకాశం లభించిందని తెలిపారు.అలాగే పోత్నక్ ప్రమోద్ కుమార్,తంగళ్ళపల్లి రవికుమార్,బర్రె జాంగిర్,గ్రంథాలయ చైర్మన్ అవైస్ చిస్తి సహకారంతో ఈ టికెట్ సాధ్యమైందని కృతజ్ఞతలు తెలిపారు.తాను గెలుపొందితే 32వ వార్డు సమగ్ర అభివృద్ధికై నిరంతరం కృషి చేస్తానని,వార్డులోని ప్రతి సమస్యపై వెంటనే స్పందించి ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని భూషపాక అండాలు హామీ ఇచ్చారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో పాటు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్ని రకాల అభివృద్ధి పనులకు పూర్తి మద్దతు అందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరేలా కృషి చేస్తానని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా వార్డులోని ప్రజలంతా తనను ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,32వ వార్డు కాంగ్రెస్ పార్టీ కమిటీ సభ్యులు,మహిళలు,పెద్ద సంఖ్యలో వార్డు ప్రజలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి