ఎమ్మార్వో ఖాళీ రైతుల కష్టాలు
ఎమ్మార్వో ఖాళీ రైతుల కష్టాలు
Komidala Mahender reddy
చిట్యాల ఎమ్మార్వో కార్యాలయంలో భూమి రిజిస్ట్రేషన్లు గత రెండు రోజులుగా నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్యాలయంలో రెగ్యులర్ ఎమ్మార్వో లేకపోవడం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా స్థంభించింది.
గతంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఎమ్మార్వోను తొలగించడంతో ఆయన స్థానంలో డిప్యూటీ ఎమ్మార్వోకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. అయితే ఆ డిప్యూటీ ఎమ్మార్వో ఫీల్డ్ వర్క్తో పాటు జనగణన శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటూ కార్యాలయానికి రాకపోవడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.
రిజిస్ట్రేషన్ల కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు రోజులు గడిచినా పనులుజరగకపోవడంతో కార్యాలయంచుట్టూతిరుగుతున్నారు. అయినప్పటికీ రెవిన్యూ అధికారులు సమస్య పరిష్కారంపై పెద్దగా దృష్టి సారించకపోవడం రైతుల్లో ఆగ్రహం రేకెత్తిస్తోంది.
ఇక రేపు కూడా జనగణన శిక్షణ ఉండటం, ఆ తర్వాత రెండవ శనివారం, ఆదివారం వరుస సెలవులు ఉండటంతో రిజిస్ట్రేషన్లు సోమవారం వరకు నిలిచిపోయే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ఇప్పటికే ఎదురు చూస్తున్న రైతులు మరికొన్ని రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
డిప్యూటీ ఎమ్మార్వోలకు ఇన్ఛార్జ్ బాధ్యతలు ఉన్న కార్యాలయాల్లో ఇలాంటి సమస్యలు తరచూ ఎదురవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. చిట్యాల కార్యాలయానికి రెగ్యులర్ ఎమ్మార్వోను నియమించి సమస్యను తక్షణమే పరిష్కరించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి