Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:10 AM

ఎమ్మార్వో ఖాళీ రైతుల కష్టాలు

ఎమ్మార్వో ఖాళీ రైతుల కష్టాలు

ఎమ్మార్వో ఖాళీ  రైతుల కష్టాలు
March 12, 2026 03:23 PM 210 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల ఎమ్మార్వో కార్యాలయంలో భూమి రిజిస్ట్రేషన్లు గత రెండు రోజులుగా నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్యాలయంలో రెగ్యులర్ ఎమ్మార్వో లేకపోవడం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా స్థంభించింది.

గతంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఎమ్మార్వోను తొలగించడంతో ఆయన స్థానంలో డిప్యూటీ ఎమ్మార్వోకు ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. అయితే ఆ డిప్యూటీ ఎమ్మార్వో ఫీల్డ్ వర్క్‌తో పాటు జనగణన శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటూ కార్యాలయానికి రాకపోవడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.

రిజిస్ట్రేషన్ల కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు రోజులు గడిచినా పనులుజరగకపోవడంతో కార్యాలయంచుట్టూతిరుగుతున్నారు. అయినప్పటికీ రెవిన్యూ అధికారులు సమస్య పరిష్కారంపై పెద్దగా దృష్టి సారించకపోవడం రైతుల్లో ఆగ్రహం రేకెత్తిస్తోంది.

ఇక రేపు కూడా జనగణన శిక్షణ ఉండటం, ఆ తర్వాత రెండవ శనివారం, ఆదివారం వరుస సెలవులు ఉండటంతో రిజిస్ట్రేషన్లు సోమవారం వరకు నిలిచిపోయే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ఇప్పటికే ఎదురు చూస్తున్న రైతులు మరికొన్ని రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

డిప్యూటీ ఎమ్మార్వోలకు ఇన్‌ఛార్జ్ బాధ్యతలు ఉన్న కార్యాలయాల్లో ఇలాంటి సమస్యలు తరచూ ఎదురవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. చిట్యాల కార్యాలయానికి రెగ్యులర్ ఎమ్మార్వోను నియమించి సమస్యను తక్షణమే పరిష్కరించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News