ఎమ్మెల్యేకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన రెవెన్యూ సిబ్బంది
ఎమ్మెల్యేకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన రెవెన్యూ సిబ్బంది
Sthanikam District Staff Reporter krishna
నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి: 2026 ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని డిప్యూటీ తహశీల్దార్ రాజు పాటిల్ ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గురువారం నాడు ఆయన స్వగృహంలో ఎమ్మెల్యేను కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి మాట్లాడుతూ.., నూతన సంవత్సరంలో ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా రెవెన్యూ సిబ్బంది సమన్వయంతో పని చేయాలని కోరారు. ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి ముందుకు సాగాలని అన్నారు.ఈ కార్యక్రమంలో నాయబ్ తహశీల్దార్ ఈశ్వర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మాధవ రెడ్డి,సర్వేయర్ మల్లేశం, జూనియర్ అసిస్టెంట్ సుధాకర్,రాజు,దినకర్, రాజు, ఆపరేటర్ రవి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి