ఎల్ఆర్ఎస్కు భారీ ఊరట జూలై 31 వరకు 25 శాతం రాయితీ చౌటుప్పల్ ప్రజలకు చైర్పర్సన్ పావని రమేష్ గౌడ్ పిలుపు
ఎల్ఆర్ఎస్కు భారీ ఊరట జూలై 31 వరకు 25 శాతం రాయితీ చౌటుప్పల్ ప్రజలకు చైర్పర్సన్ పావని రమేష్ గౌడ్ పిలుపు
K.RAVI
అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్) ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు భారీ ఊరట కల్పించిందని చౌటుప్పల్ పురపాలక సంఘం చైర్పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ తెలిపారు. ఎల్ఆర్ఎస్ ఫీజులు ఇతర ఛార్జీలపై 25 శాతం రాయితీ ప్రకటించిందని వెల్లడించారు. ఈ ప్రత్యేక రాయితీ సౌకర్యాన్ని 2026 మే 1 నుంచి జూలై 31 వరకు ప్రభుత్వం అందుబాటులో ఉంచిందన్నారు.అనధికార లేఅవుట్లలో ప్లాట్లు కలిగిన ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తక్కువ వ్యయంతో తమ ఆస్తులకు ప్రభుత్వ గుర్తింపు, చట్టబద్ధత పొందవచ్చని ఆమె సూచించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ జారీ చేసిన జీఓ ఎంఎస్ నెం.131 ప్రకారం ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.
చౌటుప్పల్ పట్టణ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కీలకమని పేర్కొన్న ఆమె, గడువు ముగిసేలోపు ఫీజులు చెల్లించి ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి