Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:03 AM

ఎల్ఆర్ఎస్‌కు భారీ ఊరట జూలై 31 వరకు 25 శాతం రాయితీ చౌటుప్పల్ ప్రజలకు చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ పిలుపు

ఎల్ఆర్ఎస్‌కు భారీ ఊరట జూలై 31 వరకు 25 శాతం రాయితీ చౌటుప్పల్ ప్రజలకు చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ పిలుపు

ఎల్ఆర్ఎస్‌కు భారీ ఊరట జూలై 31 వరకు 25 శాతం రాయితీ చౌటుప్పల్ ప్రజలకు చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ పిలుపు
11-05-2026 233 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్) ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు భారీ ఊరట కల్పించిందని చౌటుప్పల్ పురపాలక సంఘం చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ తెలిపారు. ఎల్ఆర్ఎస్ ఫీజులు ఇతర ఛార్జీలపై 25 శాతం రాయితీ ప్రకటించిందని వెల్లడించారు. ఈ ప్రత్యేక రాయితీ సౌకర్యాన్ని 2026 మే 1 నుంచి జూలై 31 వరకు ప్రభుత్వం అందుబాటులో ఉంచిందన్నారు.అనధికార లేఅవుట్లలో ప్లాట్లు కలిగిన ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తక్కువ వ్యయంతో తమ ఆస్తులకు ప్రభుత్వ గుర్తింపు, చట్టబద్ధత పొందవచ్చని ఆమె సూచించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ జారీ చేసిన జీఓ ఎంఎస్ నెం.131 ప్రకారం ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.

చౌటుప్పల్ పట్టణ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కీలకమని పేర్కొన్న ఆమె, గడువు ముగిసేలోపు ఫీజులు చెల్లించి ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Sthanikam

ఎల్ఆర్ఎస్‌కు భారీ ఊరట జూలై 31 వరకు 25 శాతం రాయితీ చౌటుప్పల్ ప్రజలకు చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ పిలుపు

Article Image

అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్) ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు భారీ ఊరట కల్పించిందని చౌటుప్పల్ పురపాలక సంఘం చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ తెలిపారు. ఎల్ఆర్ఎస్ ఫీజులు ఇతర ఛార్జీలపై 25 శాతం రాయితీ ప్రకటించిందని వెల్లడించారు. ఈ ప్రత్యేక రాయితీ సౌకర్యాన్ని 2026 మే 1 నుంచి జూలై 31 వరకు ప్రభుత్వం అందుబాటులో ఉంచిందన్నారు.అనధికార లేఅవుట్లలో ప్లాట్లు కలిగిన ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తక్కువ వ్యయంతో తమ ఆస్తులకు ప్రభుత్వ గుర్తింపు, చట్టబద్ధత పొందవచ్చని ఆమె సూచించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ జారీ చేసిన జీఓ ఎంఎస్ నెం.131 ప్రకారం ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.

చౌటుప్పల్ పట్టణ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కీలకమని పేర్కొన్న ఆమె, గడువు ముగిసేలోపు ఫీజులు చెల్లించి ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News