ఎల్లగిరిలో యువకుడు గల్లంతు
ఎల్లగిరిలో యువకుడు గల్లంతు
K.RAVI
హోటల్ పనులు ముగించుకొని నిద్రపోయిన తర్వాత కనిపించని పన్నారామ్
ఎల్లగిరి ఎక్స్రోడ్ వద్ద ఉన్న శ్రీ మహాదేవ రాజస్థాన్ హోటల్లో పనిచేస్తున్న పన్నారామ్ (20) అనుమానాస్పదంగా గల్లంతైన ఘటన కలకలం రేపింది. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన పన్నారామ్ (తండ్రి ప్రతాప్ రాంజీ) ప్రస్తుతం ఎల్లగిరి గ్రామంలో నివాసముంటూ హోటల్ నిర్వహణలో సహకరిస్తున్నాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, ఫిబ్రవరి 17న హోటల్ పనులు ముగించుకుని తన సోదరులతో కలిసి నిద్రపోయాడు. అయితే ఫిబ్రవరి 18 ఉదయం 6 గంటలకు లేచి చూడగా పన్నారామ్ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ఎలాంటి సమాచారం లభించలేదు.అన్న ఫిర్యాదుతో కేసు నమోదు పోలీసులు దర్యాప్తు ప్రారంభం
పన్నారామ్ ఎత్తు సుమారు 5.2 అడుగులు, తెల్లని వర్ణం కలవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అతని అన్న ముఖేష్ పటేల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి