Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:53 PM

ఎల్గూరి ఇందిర గెలుపు అభివృద్ధికి మలుపు

ఎల్గూరి ఇందిర గెలుపు అభివృద్ధికి మలుపు

ఎల్గూరి ఇందిర గెలుపు అభివృద్ధికి మలుపు
February 13, 2026 06:37 PM 101 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పదకొండవ వార్డులో ప్రజల తీర్పుకు కృతజ్ఞతలు – మల్లు లక్ష్మి

సూర్యాపేట గ్రామీణం: మున్సిపాలిటీ ఎన్నికల్లో పదకొండవ వార్డు నుండి సిపిఎం, బిఆర్ఎస్ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి భారీ మెజార్టీతో విజయం సాధించిన ఎల్గూరి ఇందిర గెలుపు అభివృద్ధికి మలుపు అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి పేర్కొన్నారు.శుక్రవారం ఎల్గూరి ఇందిరను పూలమాలతో ఘనంగా సన్మానించిన అనంతరం నిర్వహించిన విజయోత్సవ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ రాయినిగూడెం ప్రాంత అభివృద్ధి ఎల్గూరి ఇందిరతోనే సాధ్యమని అన్నారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఎల్గూరి ఇందిర గత నాలుగేళ్లుగా వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారని తెలిపారు.పేదలకు ఏ ఆపద వచ్చినా అందుబాటులో ఉంటూ రాజకీయాలకు అతీతంగా సేవలందించారని, అనేక కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తూ అండగా నిలిచారని కొనియాడారు. ప్రత్యర్థి అభ్యర్థి ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు సేవాభావం ఉన్న అభ్యర్థిని గుర్తించి గెలిపించారని పేర్కొన్నారు. ఎల్గూరి ఇందిర విజయంలో భాగస్వాములైన రాయినిగూడెం పదకొండవ వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు మేకనబోయిన శేఖర్, కొప్పుల రజిత, సిపిఎం నాయకులు మేకనబోయిన సైదమ్మ, మందడి రామిరెడ్డి, నల్ల మేకల అంజయ్య, కామల్ల లింగయ్య, నారాయణ వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News