Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా వ్యాపారవేత్త గోదల వెంకటరెడ్డి జన్మదిన వేడుక 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 04, 2026 01:36 AM

ఎల్‌బీ నగర్ జోనల్ కమిషనర్‌ను కలిసిన మాజీ కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి

ఎల్‌బీ నగర్ జోనల్ కమిషనర్‌ను కలిసిన మాజీ కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి

ఎల్‌బీ నగర్ జోనల్ కమిషనర్‌ను కలిసిన మాజీ కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి
May 14, 2026 07:30 PM 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Rangareddy dist
RAPOLU LINGASWAMY

ఎల్‌బీ నగర్ జోనల్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన వికాస్ మహాతోను హయత్‌నగర్ మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జోనల్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా నవజీవన్ రెడ్డి మాట్లాడుతూ ఎల్‌బీ నగర్ జోన్ పరిధిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేయాలని కోరారు. హయత్‌నగర్ డివిజన్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్యం, రహదారుల అభివృద్ధి వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని ఆకాంక్షించారు. సమావేశం సానుకూల వాతావరణంలో కొనసాగినట్లు తెలిపారు.

కార్యక్రమంలో బీజేపీ డివిజన్ ప్రధాన కార్యదర్శి గోవింద చారి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News