ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ను కలిసిన మాజీ కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి
ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ను కలిసిన మాజీ కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి
RAPOLU LINGASWAMY
ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన వికాస్ మహాతోను హయత్నగర్ మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జోనల్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా నవజీవన్ రెడ్డి మాట్లాడుతూ ఎల్బీ నగర్ జోన్ పరిధిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేయాలని కోరారు. హయత్నగర్ డివిజన్తో పాటు పరిసర ప్రాంతాల్లో ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్యం, రహదారుల అభివృద్ధి వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని ఆకాంక్షించారు. సమావేశం సానుకూల వాతావరణంలో కొనసాగినట్లు తెలిపారు.
కార్యక్రమంలో బీజేపీ డివిజన్ ప్రధాన కార్యదర్శి గోవింద చారి తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి