ఎల్బీనగర్ కాలనీలో సమస్యలకు పరిష్కారం
ఎల్బీనగర్ కాలనీలో సమస్యలకు పరిష్కారం
Editor Desk
ఎల్బీనగర్ కాలనీలో సమస్యలకు పరిష్కారం
కాంగ్రెస్ నాయకుల చొరవతో అధికారుల తక్షణ చర్య
మల్కాజిగిరి, స్థానిక రిపోర్టర్
మల్కాజిగిరి నియోజకవర్గం 140వ డివిజన్ పరిధిలోని ఎల్బీనగర్ కాలనీ వాసులు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలకు కాంగ్రెస్ నాయకుల చొరవతో పరిష్కారం లభించింది. కాంగ్రెస్ సీనియర్ నేత మైనంపల్లి హనుమంతన్న ఆదేశాల మేరకు కాలనీ సమస్యలను డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు జీడి సంపత్ కుమార్ గౌడ్ దృష్టికి కాలనీ వాసులు తీసుకువచ్చారు.
సమస్యలపై వెంటనే స్పందించిన సంపత్ కుమార్ గౌడ్ సంబంధిత ఎలక్ట్రికల్, మున్సిపల్ అధికారులను కాలనీలోకి పిలిపించి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలింపజేశారు. అనంతరం విద్యుత్, పారిశుద్ధ్యం, మౌలిక వసతులకు సంబంధించిన అంశాలను తక్షణమే పరిష్కరించేందుకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు మోర శ్రీకాంత్ ముదిరాజ్, పార్థసారథి, మల్లేష్ గౌడ్, నరేష్, శ్రీశైలం ముదిరాజ్లతో పాటు కాలనీ వాసులు నరేందర్, పాల్ రాజ్, వీరేశ్, సతీష్, సంజీవ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ నిరంతరం స్పందిస్తూ పరిష్కార దిశగా ముందుకెళ్తోందని నేతలు పేర్కొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి