Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:12 AM

ఎక్సైజ్ పోలీసుల దాడుల్లో రేచర్ల వ్యక్తి అరెస్ట్

ఎక్సైజ్ పోలీసుల దాడుల్లో రేచర్ల వ్యక్తి అరెస్ట్

ఎక్సైజ్ పోలీసుల దాడుల్లో రేచర్ల వ్యక్తి అరెస్ట్
March 11, 2026 05:46 PM 69 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా చింతలపూడి మండలం రేచర్ల గ్రామంలో ఎక్సైజ్ పోలీసులు మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించి ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. గ్రామంలో నాటుసారాయి తయారీ మరియు విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.

ఈ తనిఖీల్లో రేచర్ల గ్రామానికి చెందిన ధారావతు వెంకటేశ్వరరావు వద్ద నుంచి సుమారు రెండు లీటర్ల నాటుసారాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ సీఐ అశోక్ తెలిపారు.

నాటుసారాయి తయారీ, నిల్వ, విక్రయాలు చట్ట విరుద్ధమని, ఇలాంటి కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రజలు కూడా ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం అందించి ఎక్సైజ్ శాఖకు సహకరించాలని కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News