ఏలూరు జిల్లా చింతలపూడి మండలం రేచర్ల గ్రామంలో ఎక్సైజ్ పోలీసులు మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించి ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. గ్రామంలో నాటుసారాయి తయారీ మరియు విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీల్లో రేచర్ల గ్రామానికి చెందిన ధారావతు వెంకటేశ్వరరావు వద్ద నుంచి సుమారు రెండు లీటర్ల నాటుసారాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ సీఐ అశోక్ తెలిపారు.
నాటుసారాయి తయారీ, నిల్వ, విక్రయాలు చట్ట విరుద్ధమని, ఇలాంటి కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రజలు కూడా ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం అందించి ఎక్సైజ్ శాఖకు సహకరించాలని కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి