Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 09:13 AM

ఏసీబీ వలలో విద్యాశాఖకు చెందిన లంచగొండి అధికారులు

ఏసీబీ వలలో విద్యాశాఖకు చెందిన లంచగొండి అధికారులు

ఏసీబీ వలలో విద్యాశాఖకు చెందిన లంచగొండి అధికారులు
January 21, 2026 09:07 AM 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

మదనపల్లె జనవరి 21(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) అవినీతిపై ఏసీబీ మెరుపుదాడి - మదనపల్లె డీఈఓ కార్యాలయంలో కలకలం అన్నమయ్య జిల్లాలో అవినీతికి చెక్ పెట్టే దిశగా ఏసీబీ అధికారులు కీలక చర్యకు దిగారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాల్సిన విద్యాశాఖలోనే లంచాల దందా బయటపడటం కలచివేసే విషయం. గుర్రంకొండ మండలంలోని ఓ ప్రైవేట్ స్కూల్ యజమాని నుంచి రూ.40,000 లంచం తీసుకుంటూ మదనపల్లె జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయానికి చెందిన ఏడి రాజశేఖర్ సీనియర్ అసిస్టెంట్ మున్నా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా చిక్కారు. స్కూల్ అనుమతులు, ఫైలుల కదలికల పేరుతో లంచాలు డిమాండ్ చేస్తున్నారనే ఫిర్యాదుతో సోమవారం మధ్యాహ్నం ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో దాడులు నిర్వహించారు. దీంతో డీఈఓ కార్యాలయం పరిసరాల్లో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. విద్య వ్యవస్థను వ్యాపారంగా మార్చి, చట్టాన్ని జేబులో పెట్టుకున్న అధికారులకు ఇదొక గట్టి హెచ్చరిక. ప్రజల డబ్బుతో జీతాలు తీసుకుంటూ ప్రజలనే దోచుకుంటే - ఇలానే బయటపడతారు! ఏసీబీ అధికారులు త్వరలోనే నిందితుల అరెస్టు వివరాలు లంచం డిమాండ్ చేసిన పూర్తి కారణాలు మరెవరైనా పాత్ర ఉందా?అన్న అంశాలను అధికారికంగా వెల్లడించనున్నారు.అవినీతిపై పోరాటం కొనసాగాలి విద్యా వ్యవస్థ పరిశుభ్రంగా ఉండాలి

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News