ఏసీబీ వలలో విద్యాశాఖకు చెందిన లంచగొండి అధికారులు
ఏసీబీ వలలో విద్యాశాఖకు చెందిన లంచగొండి అధికారులు
GADDAM JAGANMOHAN REDDY
మదనపల్లె జనవరి 21(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) అవినీతిపై ఏసీబీ మెరుపుదాడి - మదనపల్లె డీఈఓ కార్యాలయంలో కలకలం అన్నమయ్య జిల్లాలో అవినీతికి చెక్ పెట్టే దిశగా ఏసీబీ అధికారులు కీలక చర్యకు దిగారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాల్సిన విద్యాశాఖలోనే లంచాల దందా బయటపడటం కలచివేసే విషయం. గుర్రంకొండ మండలంలోని ఓ ప్రైవేట్ స్కూల్ యజమాని నుంచి రూ.40,000 లంచం తీసుకుంటూ మదనపల్లె జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయానికి చెందిన ఏడి రాజశేఖర్ సీనియర్ అసిస్టెంట్ మున్నా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా చిక్కారు. స్కూల్ అనుమతులు, ఫైలుల కదలికల పేరుతో లంచాలు డిమాండ్ చేస్తున్నారనే ఫిర్యాదుతో సోమవారం మధ్యాహ్నం ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో దాడులు నిర్వహించారు. దీంతో డీఈఓ కార్యాలయం పరిసరాల్లో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. విద్య వ్యవస్థను వ్యాపారంగా మార్చి, చట్టాన్ని జేబులో పెట్టుకున్న అధికారులకు ఇదొక గట్టి హెచ్చరిక. ప్రజల డబ్బుతో జీతాలు తీసుకుంటూ ప్రజలనే దోచుకుంటే - ఇలానే బయటపడతారు! ఏసీబీ అధికారులు త్వరలోనే నిందితుల అరెస్టు వివరాలు లంచం డిమాండ్ చేసిన పూర్తి కారణాలు మరెవరైనా పాత్ర ఉందా?అన్న అంశాలను అధికారికంగా వెల్లడించనున్నారు.అవినీతిపై పోరాటం కొనసాగాలి విద్యా వ్యవస్థ పరిశుభ్రంగా ఉండాలి
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి