ఈనాడు విలేకరి తాళ్లూరి వెంకన్న కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం
ఈనాడు విలేకరి తాళ్లూరి వెంకన్న కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం
Editor Desk
ఈనాడు విలేకరి తాళ్లూరి వెంకన్న కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం చేతుల మీదుగా అందజేత
శాలిగౌరారం / నకిరేకల్: స్థానికం ప్రతినిధి
శాలిగౌరారం మండల కేంద్రానికి చెందిన ప్రముఖ ఈనాడు విలేకరి తాళ్లూరి వెంకన్న అకాల మరణం పట్ల నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంకన్న మరణవార్త తెలుసుకున్న ఆయన, కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్పు తెలిపారు.
ఈ సందర్భంగా వెంకన్న కుటుంబానికి రూ.20,000 (ఇరవై వేల రూపాయలు) ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే వారి పిల్లల చదువులకు అవసరమైన అన్ని విధాలా సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
వెంకన్న మరణం జర్నలిజం రంగానికి తీరని లోటని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కష్ట సమయంలో కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వెంకన్న ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యం ఇవ్వాలని ఆకాంక్షించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి