Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లక్ష్య సాధనకు పట్టుదల అవసరం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:18 PM

ఏలూరులో గురు సంత్ రవిదాస్ ఉత్సవాల్లో భాగంగా ర్యాలీ నిర్వహణ

ఏలూరులో గురు సంత్ రవిదాస్ ఉత్సవాల్లో భాగంగా ర్యాలీ నిర్వహణ

ఏలూరులో గురు సంత్ రవిదాస్ ఉత్సవాల్లో భాగంగా ర్యాలీ నిర్వహణ
February 05, 2026 08:14 PM 98 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

గురు సంత్ రవిదాస్ మహారాజ్ ఉత్సవాలను పురస్కరించుకొని 5వ రోజు ఏలూరు జిల్లా కేంద్రంలో ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు శ్రీకర్ బుర్రి అధ్యక్షతన ర్యాలీ నిర్వహించి అనంతరం శర్మ కార్మికుల దగ్గరకు వెళ్లి వారిని శాలువతో సన్మానించి సంత్ గురు రవి దాస్ చిత్రపటాన్ని అందజేసి ఆయన జీవిత చరిత్రను గొప్పతనాన్ని వారికి వివరించడం జరిగింది ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్ విచ్చేసి మాట్లాడుతూ, సంత్ రవి దాస్ 15వ శతాబ్దంలో జన్మించి ఆ కాలంలోనే చెప్పులు కుట్టి పాదచారులకు ఇచ్చేవారని, ఆయన ఒక సజీవ చైతన్యం సమిష్టి సంకల్పం మరియు అన్యాయానికి తలవంచకూడదని మానవాళిని ఏకం చేయాలని భారతదేశం యొక్క నాగరిక కథ యొక్క సిహ్నమని, కుల వివక్ష మరియు అంటరానితనం వంటి సామాజిక దురాచారాలను నిర్మించడానికి ఆయన తన జీవితాన్ని మొత్తం అంకితం చేశారని, ఆయన పోరాటం త్యాగం నేటికీ మనకి పూర్తి దాయకం గానే ఉన్నాయని, దాస్ రచనలు కవిత్వాలు విధివిధానాలు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆలోచనపై గాఢమైన ప్రభావం చూపాయని, ముఖ్యంగా కుల వ్యవస్థ వ్యతిరేకతలో అతని మానవత్వం సందేశాలు దళిత ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచాయని, దళితుల హక్కులు అవసరాల కోసం పోరాడే ఆలోచన శక్తి రవిదాసు, కబీర్, బుద్ధుని యొక్క భక్తి విధానాలు అంబేద్కర్ వరకు కుల వ్యతిరేకత దాశనికత గొలుసుగా ఏర్పడిందని, అలాగే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రపంచంలో అతిపెద్దదైన భారత రాజ్యాంగాన్ని వ్రాయడానికి స్ఫూర్తి నిచ్చిందని నమ్ముతూ భారతీయ జనతా పార్టీ మరియు ప్రధాని నరేంద్ర మోడీ దళిత జాతి రత్నాలను ఈ తరం వారికి పరిచయం చేస్తూ వారు మరచిపోయే వ్యక్తులు కాదు ముందు తరాల వారు గుర్తించుకోవాల్సినటువంటి ఒక ప్రతిష్టమైన దైవశక్తుల్లాంటి వాళ్ళు అని గుర్తు చేస్తూ దళితుల అభివృద్ధికి గౌరవానికి పూర్తి న్యాయం చేయదలచారని, గౌతమ్ బుద్ధుడు రవి దాస్ మరియు అంబేద్కర్ లాంటి గొప్ప వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని ప్రతి దళితుడు ముందుకు వెళ్లాలని ప్రధానమంత్రి మోడీ పిలుపునిచ్చారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు పార్లమెంటు కన్వీనర్ మరియు ఆంధ్రప్రదేశ్ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ కాట్నేని కృష్ణ ప్రసాద్, గోదావరి జోన్ ఎస్సీ మోర్చా ఇన్చార్జి దున్న సుమన్ బాబు, బగరం వెంకటలక్ష్మి, గంటా శ్రీనివాస్, చేకూరి గణపతి, కరిబండి నాగరాజు, ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు, నాగరాజు, ఏలూరు జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ చాగంటి వాసుదేవ రావు పలువురు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News