ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఆరోగ్య కేంద్ర, ఉప కేంద్రాల సమస్యలను పరిష్కరించాలని కోరిన బిజెపి సీనియర్ నేత బుర్రి శ్రీకర్
ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఆరోగ్య కేంద్ర, ఉప కేంద్రాల సమస్యలను పరిష్కరించాలని కోరిన బిజెపి సీనియర్ నేత బుర్రి శ్రీకర్
GADDAM JAGANMOHAN REDDY
ఏలూరు జనవరి 20(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) చాట్రాయి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు ఉప కేంద్రాలు పోయిన వైసీపీ గవర్నమెంట్ అవినీతి పలనలో అస్తవ్యస్తంగా నిలిపివేయబడ్డాయని, ఇది ఒక చాట్రాయి మండలం కాదు ఏలూరు జిల్లా మొత్తం 35 మండలాలకు కూడా ఇదే పరిస్థితిలో ఉండటం వలన ప్రాథమిక ఉప కేంద్రాలలో పనిచేసేటువంటి MLHPలు,ANM లు,ఆశ వర్కర్ లు అద్దె ఇళ్లలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలు నిర్వహిస్తూ ఇబ్బందులు పడుతున్నారని, అలాగే వైద్యం కోసం వచ్చేటువంటి పేషెంట్లు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని, బిజెపి దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు శ్రీకర్ బుర్రి ఈ సమస్యను గమనించి ,అద్దె ఇళ్లలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలు అనేక కారణాలవల్ల సంవత్సరానికి రెండు మూడు సార్లు మార్చ వలసి వస్తుందనని, వైద్యం అనేది ప్రతి మనిషి యొక్క నిత్యావసర ఆరోగ్య సమస్య కాబట్టి చాట్రాయి మండల మరియు ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ సమస్యను ,భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని బిజెపి జనతా వారధి కార్యక్రమంలో భాగంగా , విషయాన్ని ఏలూరు జిల్లా వైద్యాధికారి DMHO ద్వారా కలెక్టర్ కి అర్జీ ద్వారా ప్రాథమిక ఉప కేంద్రాల స్టేటస్ నమూనా తో ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వికి అర్జీ రూపంలో ఇవ్వడం జరిగిందని, ఈ విషయంపై వెంటనే స్పందించిన కలెక్టర్ ఈ సమస్యని పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ కి ఫార్వర్డ్ చేసి ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలు నిర్మాణం వెంటనే మొదలు పెట్టవలసిందిగా ఆదేశాలు జారీ చేశారని,బుర్రి శ్రీకర్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జనతా వారధి కన్వీనర్లు,నగరపాటి సత్యనారాయణ, గుమ్మడి చైతన్య సుబ్బారావు, నెలరాజు, మరియు కార్యకర్తలు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి