ఎంఎల్సీ అంజిరెడ్డి,మాజీ ఎమ్మెల్యే విజయ్ పాల్ రెడ్డి కలిసి బీజేపా కార్యకర్తలతో ప్రచారం
ఎంఎల్సీ అంజిరెడ్డి,మాజీ ఎమ్మెల్యే విజయ్ పాల్ రెడ్డి కలిసి బీజేపా కార్యకర్తలతో ప్రచారం
Sthanikam District Staff Reporter krishna
నారాయణఖేడ్ మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంఎల్సీ అంజిరెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యే విజయ్ పాల్ రెడ్డి 1వ వార్డు బీజేపా అభ్యర్థి లలిత రామకృష్ణ మద్దతుగా చాంద్ ఖాన్ పల్లిలో భాజపా కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు.ఈ ప్రచారం ప్రజలలో మంచి స్పందన పొందుతూ విజయవంతంగా సాగింది.కార్యక్రమంలో పాల్గొన్న అభ్యర్థులు, నాయకులు ప్రజలకు వార్డు అభివృద్ధి, సక్రమ పాలన, పారదర్శక ప్రభుత్వ విధానాల గురించి వివరించారు.ఈ సందర్భంగా విజయ్ పాల్ రెడ్డి గత ప్రభుత్వాల పాలన కారణంగా నారాయణఖేడ్ సరిగ్గా అభివృద్ధి చెందలేదని, ప్రజలు ఈ ఎన్నికల్లో బీజేపాకు మద్దతు ఇస్తే కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు సక్రమంగా వినియోగించుకోవచ్చని వెల్లడించారు. ప్రజలకు అభివృద్ధి కోసం ఇది మంచి అవకాశమని సూచించారు.ప్రచారంలో పాల్గొన్న కార్యకర్తలు, స్థానిక ప్రజలు అభ్యర్థులకు మద్దతు ప్రకటించి, వార్డు అభివృద్ధి లక్ష్యంగా వారిని ప్రోత్సహించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి