Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 07:55 AM

ఏళ్లుగా ఊడిపడిన జియో వైర్లు.. నిదానపల్లిలో అధికారుల నిర్లక్ష్యం

ఏళ్లుగా ఊడిపడిన జియో వైర్లు.. నిదానపల్లిలో అధికారుల నిర్లక్ష్యం

ఏళ్లుగా ఊడిపడిన జియో వైర్లు.. నిదానపల్లిలో అధికారుల నిర్లక్ష్యం
January 04, 2026 08:00 AM 299 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నిదానపల్లిలో ఫైబర్ నెట్ ఫెయిల్యూర్‌

ఏళ్లుగా నేలమీదే జియో వైర్లు.. మౌనంగా అధికారులు

యాదాద్రి భువనగిరి జిల్లా

రామన్నపేట స్థానికం ప్రతినిధి

డిజిటల్ గ్రామాలంటూ గొప్పలు చెప్పుకుంటున్న పాలనకు నిదానపల్లి గ్రామం అద్దంలా నిలుస్తోంది. రామన్నపేట మండలంలోని ఈ గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫైబర్ నెట్ ప్రాజెక్టు అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా మారింది.

గ్రామానికి హైస్పీడ్ ఇంటర్నెట్ అందించాలనే లక్ష్యంతో రోడ్ల వెంబడి స్తంభాలపై ఏర్పాటు చేసిన జియో ఫైబర్ కేబుల్ వైర్లు ఏళ్లుగా ఊడిపడి నేలమీదే కనిపిస్తున్నాయి. కాలం గడుస్తున్నా వాటి వైపు సంబంధిత అధికారులు కన్నెత్తి చూడకపోవడం పట్ల గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పొలాలకు వెళ్లే రైతులు, ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలు గ్రామ రహదారులు దాటేటప్పుడు ఈ వైర్లు అడ్డుపడుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి దారి తీయవచ్చన్న భయం గ్రామాన్ని వెంటాడుతున్నా, అధికార యంత్రాంగం మాత్రం నిర్లక్ష్య ధోరణినే కొనసాగిస్తోంది.

అభివృద్ధి పేరుతో ఏర్పాటు చేసిన మౌలిక వసతులే ఇప్పుడు ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పూర్తిగా కొరవడడమే ఈ దుస్థితికి కారణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

ఇప్పటికైనా ఇంటర్నెట్ విభాగానికి చెందిన అధికారులు స్పందించి, నేలమీద ఊడిపడి ఉన్న ఫైబర్ కేబుల్ వైర్లను వెంటనే తొలగించి శాశ్వత పరిష్కారం చూపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఏదైనా పెద్ద ప్రమాదం జరిగితే దానికి పూర్తి బాధ్యత అధికారులదేనని హెచ్చరిస్తున్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News