Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 07:56 AM

ఏళ్ల నాటి రోడ్డు సమస్యకు తెర.. వెల్లంకి–గుండ్రంపల్లికి కొత్త రహదారి. తిమ్మాపురం మహేందర్ రెడ్డి

ఏళ్ల నాటి రోడ్డు సమస్యకు తెర.. వెల్లంకి–గుండ్రంపల్లికి కొత్త రహదారి. తిమ్మాపురం మహేందర్ రెడ్డి

ఏళ్ల నాటి రోడ్డు సమస్యకు తెర.. వెల్లంకి–గుండ్రంపల్లికి కొత్త రహదారి. తిమ్మాపురం మహేందర్ రెడ్డి
January 04, 2026 08:27 AM 71 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వెల్లంకి–గుండ్రంపల్లి రోడ్డుకు మహర్దశ.. రూ.2 కోట్ల నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే వేముల వీరేశం

రామన్నపేట స్థానిక ప్రతినిధి

ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న వెల్లంకి–గుండ్రంపల్లి బీటీ రోడ్డు సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రత్యేక చొరవతో ఈ రోడ్డు నిర్మాణానికి సుమారు రూ.2 కోట్ల నిధులు మంజూరయ్యాయి. టెండర్ల ప్రక్రియ పూర్తికావడంతో ప్రస్తుతం రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. దీంతో స్థానికుల్లో హర్షం వెల్లివిరిసింది.వెల్లంకి నుంచి గుండ్రంపల్లి వరకు ఉన్న ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయంగా మారి ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గ్రామ కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే వేముల వీరేశం దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే ప్రభుత్వం తో మాట్లాడి అవసరమైన నిధులను మంజూరు చేయించారు. అధికార యంత్రాంగం యుద్ధప్రాతిపదికన టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించడంతో ప్రజలకు ఊరట లభించింది.

ప్రజల కష్టాలను గుర్తించి రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించిన ఎమ్మెల్యే వేముల వీరేశంకు వెల్లంకి మాజీ ఎంపీటీసీ తిమ్మాపురం మహేందర్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అవసరాలను తీర్చడంలో ఎమ్మెల్యే ఎప్పుడూ ముందుంటారని, ఈ రోడ్డు నిర్మాణంతో వెల్లంకి గ్రామస్తుల రవాణా సమస్యలు శాశ్వతంగా తీరనున్నాయని పేర్కొన్నారు. పనులు ప్రారంభం కావడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News