Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 10:40 PM

ఏళ్ల నాటి రోడ్డు సమస్యకు తెర.. వెల్లంకి–గుండ్రంపల్లికి కొత్త రహదారి. తిమ్మాపురం మహేందర్ రెడ్డి

ఏళ్ల నాటి రోడ్డు సమస్యకు తెర.. వెల్లంకి–గుండ్రంపల్లికి కొత్త రహదారి. తిమ్మాపురం మహేందర్ రెడ్డి

ఏళ్ల నాటి రోడ్డు సమస్యకు తెర.. వెల్లంకి–గుండ్రంపల్లికి కొత్త రహదారి. తిమ్మాపురం మహేందర్ రెడ్డి
January 04, 2026 08:27 AM 74 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వెల్లంకి–గుండ్రంపల్లి రోడ్డుకు మహర్దశ.. రూ.2 కోట్ల నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే వేముల వీరేశం

రామన్నపేట స్థానిక ప్రతినిధి

ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న వెల్లంకి–గుండ్రంపల్లి బీటీ రోడ్డు సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రత్యేక చొరవతో ఈ రోడ్డు నిర్మాణానికి సుమారు రూ.2 కోట్ల నిధులు మంజూరయ్యాయి. టెండర్ల ప్రక్రియ పూర్తికావడంతో ప్రస్తుతం రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. దీంతో స్థానికుల్లో హర్షం వెల్లివిరిసింది.వెల్లంకి నుంచి గుండ్రంపల్లి వరకు ఉన్న ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయంగా మారి ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గ్రామ కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే వేముల వీరేశం దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే ప్రభుత్వం తో మాట్లాడి అవసరమైన నిధులను మంజూరు చేయించారు. అధికార యంత్రాంగం యుద్ధప్రాతిపదికన టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించడంతో ప్రజలకు ఊరట లభించింది.

ప్రజల కష్టాలను గుర్తించి రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించిన ఎమ్మెల్యే వేముల వీరేశంకు వెల్లంకి మాజీ ఎంపీటీసీ తిమ్మాపురం మహేందర్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అవసరాలను తీర్చడంలో ఎమ్మెల్యే ఎప్పుడూ ముందుంటారని, ఈ రోడ్డు నిర్మాణంతో వెల్లంకి గ్రామస్తుల రవాణా సమస్యలు శాశ్వతంగా తీరనున్నాయని పేర్కొన్నారు. పనులు ప్రారంభం కావడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News